పుట:Shriiranga-mahattvamu.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

పంచమాశ్వాసము


జుని ననలకల్పతేజునిఁ
గనుఁగొని వాల్మీకమునిశిఖామణి పలికెన్.

6


చ.

వినుము కదంబభూజ మది విశ్రుత మయ్యెను దాని పేర న
య్యనుపమతీర్థమందుఁ బ్రియమార నిమజ్జన మాచరించున
జ్జను లఘముక్తులై పరఁగ శాశ్వతవిష్ణుపదంబునందుఁ బెం
పున వసియింతు రక్కడికిఁ బోదము రమ్మని సమ్ముదమ్మునన్.

7


మ.

అని రూపంబు ధరించి వచ్చు హరిలీలాప్తిం దిగంతంబులం
దనదేహప్రభ లుల్లసిల్లఁగ భరద్వాజాన్వితుండై రయం
బున వాల్మీకమునీశ్వరుం డరుగఁ దత్పుణ్యస్థలావాసస
మ్మునివర్గం బెదు రేగుదెంచి పరమామోదంబు సంధిల్లగాన్.

8


ఉ.

దందడి మొక్కునప్పుడు, సుధామధురప్రియవాక్యచాతురిం
గొందఱఁ బల్లవప్రతిమకోమలపాణిపరిగ్రహంబులం
గొందఱి, నాదరంబు సమకొల్పుల సత్పరిరంభణంబులం
గొందఱ, గారవించి మునికుంజరుఁ డందఱు దన్ను గొల్వఁగాన్.

9


చ.

అంబురుహాప్తబాలకిరణారుణకోమలపల్లవప్రభా
లంబముఁ జందనానిలచలత్కుసుమస్తబకప్రబుద్ధరో
లంబము, నాలవాలపరిలాలితకేళివిలోలమత్తకా
దంబము, నగ్రసంశ్రితపతత్రికుటుంబము నాకదంబమున్.

10


క.

డాయఁ జని, మ్రొక్కి, భక్తిం
బాయక పూజించి, పరమపావనమగు త
చ్చాయాసంశీతలవిమ
లాయతసికతాతలమున నాసీనుండై.

11


తే.

ఆరయ నివృత్తయాగచిహ్నంబు లచట
గానఁబడినఁ గౌతూహలాకలితుఁ డగుచు
వారియందు వయస్తపోవైభవముల
నధికుఁ డగు గౌతమునకు నిట్లనియెఁ బ్రీతి.

12