పుట:Shriiranga-mahattvamu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

తృతీయాశ్వాసము


క.

సుమహిత పుష్కరిణీ తీ
ర్థమున గృతస్నానుడై 'జితంతే' యను మం
త్రమున హరిఁ దలఁచు నతఁ డఘ
సమితిఁ దొఱగి పోయి పొందు సాయుజ్యంబున్.

49


వ.

మఱియు నిచ్చట నొనర్చు దానవ్రతాదు లత్యల్పంబులైన నధికంబులగు
బితృసముద్ధేశంబునఁ జేయునవి యక్షయంబులై యెసంగు వేదమునఁ బాద
మాత్రంబైనఁ బఠించిన సర్వాధ్యయనఫలంబు నొందు శుక్లపక్షంబునఁ బూర్వ
దివసంబున భార్యాసహితుండై యుపవసించి పంచమియందుఁ గృతస్నానుండై
ఘృతప్లుతంబులైన తిలలును గుణపప్రస్థ పరిమాణంబులఁ బరిపూర్ణంబులైన
ఘృతపాత్రత్రయంబును దిలపాత్రత్రయంబును నొకసువర్ణంబును నుత్తమ
వర్ణుల కొసంగిన నతండు పుత్రవంతుండును బరమాయుష్మంతుండు నగు-
నొండేని కేవల తిలదానం బైనను ఘృతదానం బైనను సుతార్థు లగువారికిఁ
గర్తవ్యంబు నిష్కమాత్రంబు సువర్ణప్రదానంబు రోగనిర్ముక్తినిదానంబు.

50


ఉ.

వారని రాజయక్ష్మ కలవాఁడు తనంతియ హేమపుత్రికం
గోరి రచించి పుష్కరిణిఁ గ్రుంకి నభోదయకాతారకాత్మ వి
ద్యారతుఁ డైనవిప్రునకు దానము చేసి పునర్నిమజ్జనం
బారఁగఁ దీర్చి తద్ఘనతరామయదుఃఖముఁ బాయు పుణ్యుఁడై.

51


తే.

అచట గోదాన మొనరించునతఁడు గోవు
తనువునను నెన్నిరోమము లొనరు నన్ని
యబ్దశతములు త్రిదశసౌఖ్యముల నొందు
నిందు నసమానలక్ష్మి బెంపొందు మఱియు.

52


క.

కడునిష్ఠ నబ్దమాత్రం
బుడుగక నక్షత్రసూత్రయోగంబుల నె
వ్వఁడు తీర్థమాడు నిం దతఁ
డడరఁగ బహుళాశ్వమేధ మగుఫల మందున్.

53