పుట:Shriiranga-mahattvamu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

107


తే.

పర్వతిథి నందులోన నాప్లవ మొనర్చు
నాతం డలిపాతకంబుల నపనయించు
జన్మనక్షత్రమునఁ గృతస్నానుఁ డైన
మనుజపతి యేలు నఖిలభూమండలంబు.

54


సీ.

సితపక్షపంచమిఁ గృతశుచిస్నానుఁడై
యొగి మూఁడు దివసంబు లుపవసించి
యుదకపారణఁ జేసి పదపడి మఱి దివ
సత్రితయంబు త్రిసంధ్యలందు
నంభోవగాహనం బాచరించుచు హవి
ష్యాశియు భూశయనాభిరతుఁడు
నై యుండు నేనరుఁ డట్టి పుణ్యాత్మకుఁ
డతిశీఘ్రమున నపస్మృతిఁ దొఱంగు


తే.

నెలమిమై మాసమాత్ర మీకొలఁది తీర్థ
మాడువారల మును చెందినట్టి గుల్మ
కుష్ఠశూలరుజాది దుష్కోటి యడఁగు
సలిలములలోన లవణరాసులనుబోలె.

55


క.

గురుతల్పగ శిశుఘాతక
హరినిందాపర కృతఘ్న నాస్తిక మదిరా
నిరతపతితాదులకు నీ
సరసీస్నానమునఁ బాపచయశాంతి యగున్.

56


క.

నిరవధిక దురిత కరులకు
హరికీర్తన మొకటితక్క నఘనిష్కృతికిన్
మఱి లే దుపాయ మీపు
ష్కరిణియుఁ దత్సమంబుగా నెన్నఁ దగున్.

57


వ.

ఇమ్మహాతీర్థరక్షకులై విధాతృపరికల్పితు లగు పుష్కర, పుష్కరాక్ష,
కుముద, కోల, సుప్రతీపు లనువారలుఁ గ్రమంబునఁ బూర్వాది చతుర్దిశలను