పుట:Shriiranga-mahattvamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

67


రతి సమేతంబుగా నెక్కి, మధుమధురసపాన సంభ్రమ ద్భ్రమద్భ్రమర
ఝుంకార కాహళారావంబులు జెలంగ-నుభయపార్శ్వంబులఁ గదలివచ్చు-కల
కంఠ వీరభట పటలంబుల నంతకంతకు సంతసం బొలయ సేనా
ముఖంబునం గలయఁ బొలయు మలయానిలయముచేత నాఘాతంబులగు తరు
వ్రాతంబుల నెసఁగు కుసుమ పరాగంబు నభోభాగంబునఁ బర్వి సర్వంబు
పదిలంబగు నిజప్రతాపానల స్ఫులింగజాలంబు ననుకరింప నరుంధతీపతి
యాశ్రమంబు సొత్తెంచి యచ్చట రిచ్చవడియున్న యచ్చరలఁ దెలిపి కలిపి
కొని యామహీపాలు సమీపంబునకుం జనునప్పు డమ్మహాత్ముండు.

78


చ.

ఎసఁగిన బాహ్యసంచరణ మెల్లను మాన్చి మరల్చి-యెద్దెసం
దుసికిలనీక నెమ్మనముతోఁ బిరిగొల్పిన చూపు దేవతా
విసక శిరోవతంస మగు విష్ణునిపై నిడి నిస్సమీరణ
ప్రసరణ దేశదీపరుచిరస్థితి నిశ్చల యోగయుక్తుఁడై.

79


ఉ.

ఉన్న తెఱంగుఁ జూచి రభసోన్నతి మిన్నదలంగ నార్చుచుం
బన్ని శుకాన్య పుష్ట మధుపప్రకరామరకామినీ తతిన్
మున్నిడి చందనాచల సముద్ధత మందమరుత్సహాయ సం
పన్నతఁ బేర్చి యందఱకుఁ బ్రాపుగ నిల్చి యదల్చి బల్విడిన్.

80


మ.

సరి గెందామర మొగ్గనారస, మలిజ్యావల్లి సంధించి-భా
సుర మాణిక్యమయోర్మికారుచులు చక్షుష్కోణశోణద్యుతుల్
బెరయం జక్రవిభాకృతిం దనువు శోభిల్లన్ వడిందీసి ని
ర్భరముష్టిన్ వెస డాసి యేసె మరుఁ డారాజన్య చూడామణిన్.

81


తే.

అట్లు పుంఖాను పుంఖంబు లగుచు నిగుడు
నతను బాణపరంపర లానృపాలు
నిచ్చఁ దెరలింపఁ జాలక విచ్చిపోయె
జగతిఁ బూవుల కది సహజంబ కాదె.

82


క.

తా నసమాస్త్రుం డనియును
మానవపతి మానినీ సమన్వితుఁ డనియుం