పుట:Shriiranga-mahattvamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ద్వితీయాశ్వాసము


తే.

ధవళ శశికాంత వేదికాంతరమునందుఁ
చెలులతోఁ గూడి వలరాజు గొలిచె నొకతె
లలిత సహకార మాధవీలతల కెలమిఁ
బరిణయోత్సవలీలలు నెఱపె నొకతె.

75


వ.

ఇట్లు బృందారక సుందరీబృందంబు బహప్రకారంబుల మదన వికార కార
ణంబు లగు లీలావిలోల సంధిభావంబులు పచరించియుఁ గేళీ విహారంబుల
సంచరించియు-నసమశృంగార భంగీవిశేషంబుల మెఱయు నా రాజతపోధను
చిత్తంబుఁ జిత్తజాయత్తంబు చేయంజాలక -

76


ఉ.

మేనక విన్ననై నిలిచె, మెల్లన మో మర వాంచె రంభ-లో
నూనిన వింత నివ్వెఱఁగు నొందెఁ దిలోత్తమ-గర్వహీనయై
దీనత నొందె నూర్వశి, మదిఁ జలియించె ఘృతాచి యన్యకాం
కానిచయంబు లెల్ల దవుదవ్వుల నుండె భయంబు పెంపునన్.

77


వ.

అట్టి యెడ ముక్కంటి మగతనంబు సగంబుగాఁ బెనంగిన నెఱజోదు ప్రమో
దంబున బ్రయాణసమయ సముచిత సన్నాహ సంరంభ విజృంభితుండై -
బొండుమల్లెల బొమిడికంబును-గొజ్జంగి వజ్రాంగియుఁ జొన్నగుబ్బెల రాగె
వల్లులును మెఱయ, హరినీలజాలంబుల డాలు నేలు నలువునం బొలుపు మిగులు
కొదమతుమ్మెద గొనయం బెక్కించి మించుగాఁ దొడిగిన యించువిల్లునం
బెల్లు నిగిడి-పల్లవుల యుల్లంబులఁ గాడిపాఱు కోరచూపులు గల కళావతుల
కలికి కనుజిలు కడల ధగధగలం బొలయు మెఱుఁగులు గుఱిగొన బసని
కుసుమరసముం గులికి పులుగడిగి గఱులు దీర్చి వంకలొత్తిన గ్రొత్తలై
యున్న మదనమోహన వశీకరణ సంతాపనాభిధానంబుల నొప్పారు సహకార
సారసాశోక శిరీష కోరక ప్రదరంబులు నిలచి సవరించిన కవదానలు ధరి
యించి కట్టాయితంబై విరిదమ్మి బండికండ్లును బిసకాండపుటిరుసులును,
బొగడ మొగడల చీలలును దొగల నొగలును మొగలి రేకుల పలుకయుఁ
గలువకాఁడియుఁ గురువేరువాగంబులును సంతరించి వసంత సారథి తిన్ననై
యున్న క్రొన్నన మునికోలఁ గదల్చి యదల్చినం గెరలి చెరలి కొట్టుచు
మిన్నులపై బాఱు చిలుకవారువంబుల రయంబున దళతళం బొలయు
దిక్కులఁ బిక్కటిల్ల వెన్నెల నెదచల్లు వెల్లియుఁ గలిగి తనరు తనరథంబు