పుట:Shodashakumaara-charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

27


గలనూపురకాంచీమం
జులరావము లెసఁగ నింతి చూడ్కికి నబ్బెన్.

72


క.

హారావళిలో నయ్యం
భోరుహలోచనకుచాగ్రములు గనుపట్టెన్
శారదనదిఁ గానంబడు
హారిసరోజాతకుట్మలాగ్రములగతిన్.

73


ఉ.

అవ్వనజాక్షిఁ జూచి హృదయంబున రాగము నివ్వటిల్లఁగా
నివ్వెఱఁగంది ఱెప్ప లిడనేరక చూడఁగ ధైర్యమూలముల్
ద్రవ్వెడుచూపుల న్వికచతామరసానన చూచె నామదిం
బువ్విలుకాఁడు దట్టముగఁ బుష్పశరంబులఁ దూఱనేయఁగన్.

74


క.

పులకలు జెమరును గంపము
నెలకొన నొకమాటునందు నిలిచితి నే ను
జ్జ్వలపుష్పబాణబాణా
కులిత యగుచు నెట్టకేనిఁ గోమలి చనియెన్.

75


వ.

ఏనును మీనకేతనోదారశరాసారవిదారితమానసుండ నగుచు విజయసేనం గొలువ నరిగి యవసరం బగునంతకు నగరిలో నొక్కెడ వసియించి మదిరావతినిం జింతింపుచున్నంత నన్నాతి యుపమాత గనుంగొని కన్నుసన్న నన్నుం జేరి ధవళాంబరంబునం బొదివినకందుకంబుచందంబున నున్న పూదండ నాకుం జూపి యిట్లనియె.

76


క.

ఏతపం బొనరించితొ
మామదిరావతి ప్రియంబు మదిఁ గదురంగాఁ
దా ముదముతోడఁ గట్టిన
యీమాలిక నన్ను నీకు ని మ్మని పనిచెన్.

77