పుట:Shodashakumaara-charitramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

షోడశకుమారచరిత్రము


చ.

చెలువుగ నొక్కలాతమునఁ జిత్రకరాఖ్యుఁడు పట్టణంబుగా
వలసినయట్టిరూపములు వ్రాయఁగ నన్నియు నిక్కువంబు లై
యలవడఁ దత్పురీరమణుఁడై కమలాకరుఁ డన్విభుండు భూ
వలయము నేలఁజొచ్చె ననువార్త జగంబుల నెల్ల మ్రోసినన్.

66


క.

ఎసఁగిన యీవార్తలు విని
మసలక వేకదలి కాంతిమంతుండును బు
ధిసహాయుండును మోదం
బెసఁగంగా నరిగి యానృపాగ్రణిఁ గనినన్.

67


క.

ఆనెచ్చెలులం గని యా
స్థానంబున నున్న మంత్రితతియును దానున్
మానవపతి యెదురుగఁ జని
మే నలరు గౌఁగిలించి మించిన వేడ్కన్.

68


వ.

సింహాసనంబు చేరువ సముచితాసనాసీనులం గావించి వారివదనంబు లవలోకించి.

69


గీ.

మమ్ము బాసి యరిగి..........
దత్తుఁడను రాజుపురిఁ జేరి తత్తనూజుఁ
డగు విజయసేనుతోడ సఖ్యమ్ము చేసి
యుచితవృత్తిమైఁ దిరుగంగ నొక్కనాఁడు.

70


క.

ఆనృపనందను సోదరి
మానసభవురాజ్యలక్ష్మి మదిరావతి య
న్మానవతీతిలకం బు
ద్యానవిహారంబు సలుప నరిగెడువేళన్.

71


క.

విలసితమరాళరాజీ
కలకల మెసగంగ మెలఁగు కమలిని వోలెం