పుట:Shodashakumaara-charitramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

షోడశకుమారచరిత్రము


నానిజదేహము నొంది వి
మానముఁ బుత్తేర రమ్ము మాపురమునకున్.

174


వ.

అని పలికి యాక్షణంబ మే ననలజ్వాలలం దొఱంగి యరుగుటయును నావచ్చిన మార్గంబున వెలువడి విమానంబున కెదురుచూచుచున్నంత.

175


క.

రాజితమణిఘృణు లెసఁగ
న్రాజమరాళములు పూనిన విమానంబుం
దేజోనిధి యొకఁడు ఖచర
రాజాజ్ఞం దెచ్చుటయును బ్రమదం బెసఁగన్.

176


క.

ఆవరయానము నెక్కి న
భోవీథిని వీఁకఁ గనకపురమున కరుగం
గా వీరచూడుఁడు బహుసం
భావనము లొనర్చి యపుడు భావం బలరన్.

177


క.

శ్రీ నెఱయఁగఁ దనకన్యల
నానలువుర నోలిఁ బరిణయము చేసి లస
చ్చీనాంబరమణిభూషణ
నానావిధపంక్తు లిచ్చినం బ్రమదమునన్.

178


వ.

ఆలీలావతులతోడి యభీష్టలీలల విహరించి మిమ్ముఁ గాంచుతెఱం గూహించి.

179


ఉ.

మానినుల న్వరించి మఱి మానవనాథునిఁ గాంచె దంచు నా
కానతియిచ్చె మౌని తడయం బని లేదు విమాన మెక్కి యం
భోనిధి మీదుగా నరిగి భూస్థలి చూడఁగ నెవ్విధంబునం
గానఁగ నయ్యె నం చరసి గ్రక్కున నే గెద నన్ దలంపునన్.

180