పుట:Shodashakumaara-charitramu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

షోడశకుమారచరిత్రము


జనపతిఁ గలసెదు నలువురు
వనితల వరియించి మహితవైభవనిధి వై.

82


క.

ధర వర్ధమానపురమునఁ
బరోపకారి యనుధరణిపాలుఁడు గలఁ డా
నరపతి తనసుత యెవ్వని
వరియింపక యున్న నాత్మ వగ గదురంగన్.

83


సీ.

నరులకు దూరమై పరువంపునెత్తావి
        గొమరు మీఱెడుపువ్వుగుత్తి వోలెఁ
బుడమి నెవ్వరికిఁ జేపడక యుజ్జ్వలభాతిఁ
        బంబినపెన్నిధానంబు వోలెఁ
గనకసంగతి లేక ఘనశాంతి నొప్పునం
        దనరారుమహితరత్నంబు వోలె
జనులదృష్టికి నగోచర మయి కడవలో
        వెలుఁగొందుఘనదీపకళిక వోలె
వరునిపొందు లే కున్నది వారిజాక్షి
యడవిఁ గాసినవెన్నెల యగునొ యింకఁ
దరుణిజవ్వన మనుచుఁ జింతాసముద్ర
మగ్నుఁడై యున్నవాఁడు కుమారచంద్ర.

84


క.

ఆనెలఁతఁ గోరి తిరుగుము
నానాయాసములుఁ బొంది నలుగురువిలస
న్మానినులకుఁ బతి వై మీ
భూనాథునిఁ జెలులఁ గాంతు పొ మ్మని పనుపన్.

85


వ.

ఆమునీంద్రునకు వినతుండ నై చని వర్ధమానపురంబుం జొచ్చుసమయంబున.

86