పుట:Shodashakumaara-charitramu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

97

షష్ఠాశ్వాసము


తదనంతరంబ తత్ప్రాంతంబున నవతరించినం గనుంగొని డెందంబున నద్భుతంబు నొంది.

77


గీ.

ఈవిమానంబు గలుగువాఁ డెవ్వఁ డగునొ
యేమికతమున వచ్చెనో యిప్పు డనుచు
నందఱును నవ్వలన చూచునంతలోన
నవ్విమానంబు డిగి తేజ మతిశయిల్ల.

78


క.

తమచెలియైన ప్రభాకరుఁ
డమితానందంబుతోడ నరుదెంచిన భూ
రమణుఁడును మంత్రులు డెం
దమునఁ బ్రమోదంబు నద్భుతముఁ దనరారన్.

79


వ.

సముద్ధితు లగునంత సంతసంబునఁ బఱతెంచి భూపాలునకుం బ్రణామం బాచరించి యతని కౌఁగిలి వడసి క్రమంబున భీమభటాదులం బరిరంభణం బాచరించి యనంతరంబ సింహాసనంబున నాసీనుండై కమలాకరుండు ప్రత్యేకంబు నందఱి నిజాసనాసీనులం గావించి ప్రభాకరునకు సముచితాసనంబు పెట్టించి యతనివదనంబునం జూడ్కి నిలిపి నీకు విమానయానం బెట్లు గలిగె నని యడిగినం గరంబులు మొగిడిచి.

90


క.

భూనాథ మిమ్ముఁ గానక
దీనతఁ గాననములోనఁ దిరుగుచు నొకచో
మౌనీంద్రు నొకనిఁ గనఁగొని
యానతి యొనరింప నాతఁ డాదర మెసఁగన్.

81


క.

తనదివ్యబోధమున నా
మనమువిధం బెల్ల నెఱిఁగి మది వగవకు మీ