22
శతకకవులచరిత్రము
బసవపురాణపద్యకావ్యమునందు సోమనాథునిచరిత్రమును కృతిపతి వర్ణనగా నొనరించి యుండెనుగదా. వీరశైవదీక్షాబోధ రచియించిన పిడుపర్తి బనవన యిట్లు సోముని, పండితయ్యను బొగడి యున్నాఁడు.
"సవిశేషశివతత్త్వపారాదికృతుల | శివభక్తి నిష్ఠించి సృష్టికిదృష్ట
ముగ నిల్వుగన్నులు ముక్కంటిచేత | దగఁ బడసిన పండితస్వామిఁ గొలిచి
బసవపురాణాదిబహుకృతు ల్జెప్పి ! వసుమతి వీరశైవముఁ బ్రతిష్ఠించి
సకలమాహేశప్రసన్నతఁ గన్న సుకృతాత్ముఁ బాల్కుర్కి సోమేశుఁ బొగడి
కావ్యము ల్జెప్పి శంకరు కృపఁగన్న | భవ్యుల శివకవిప్రవరులఁ దలఁచి."
ఇతఁడు ప్రభులింగలీలలు పద్యకావ్యముగ వ్రాసినబసవనకుఁ బూర్యుఁడు. ఈబసవన తనకావ్యము భరద్వాజగోత్రుఁడు, శైవ భక్తుఁడు, వీర బాణావనీనాథునికొడు కగుతిమ్మనృపాలునిపుత్రుఁ డగు వీరభూపాలనకు గృతి నిచ్చెను. ఈకవికొడుకేసోమనాథుఁడు. బసవపురాణము పద్యకావ్యముగ వ్రాయుటయేగాక ప్రభులింగలీలలు కర్ణాటకమునుండి ద్విపదగా భాషాంతరీకరించినాఁడు. "
ఈతఁడు శైవబ్రాహ్మణుఁడు. మొదట నారాధ్యుఁడుగా నుండి యుత్తరవయస్సున కేవలజంగముగా మాఱి సిద్ధిపొందినట్లును, జీవించి యుండఁగనే సమాధి ప్రవేశించి యదృశ్యుఁడైనట్లును భక్తులు వ్రాసి యుండిరి. ఈతఁడు సంస్కృతాంధ్రకర్ణాటక భాషలలోనేగాక మఱికొన్నిభాషలలోఁగూడ పద్యములను వ్రాసెను.
ఈతని వంశమునుగూర్చి యిదివఱ కనేక వివాదము లున్నవి. ఈ క్రిందివాక్యములవలన నీతనితలిదండ్రులనామములే యిదివఱకు సుస్పష్టముగఁ దేలలేదని తెలియఁగలదు.
(1) అనుభవసారమం దిట్లున్నది.
క. భృంగిరిటగోత్రుఁడను గురు | లింగ తనూజుఁడ శివకులీనుఁడ దుర్వ్యా
సంగ వివర్జితుఁడ ....... | జంగమలింగప్రసాద సత్ప్రాణుండ౯!!