మొదటి యంకము.
భీమ:--దస్కత్తునాదికారు అంటేసరిపోయెను. దస్కత్తుపరీక్షకు పంపుదురు. కొంచెము మీరు పంచికట్టువిదిలించితే సరిపొతుంది లేకపోతే ఇంకొక రసీదు వారి దస్కత్తుతో హాజరుచేస్తే మరిబాగు.
శెట్టి:-- స్వాములవారు చెప్పేది నాకు ముందట్టుకురాలేదు.
భీమ:--అంతా వచ్చునులెండి! ఇది ప్రపంచము. కొంచెంకల్పనా శక్తికావలె. లేకపోతే న్యాయమే మునిగిపోతుంది. ముందు ఆలోచన చేస్తాము. కాని ప్రస్తుతము రికార్టుయిచ్చి పొండు. అడ్వాన్సు శతమానము--
శెట్టి;--చాలా భారము వేసితిరి.
భీమ:--మీయిష్టము. మీకట్ట తీరుకొని పొండి. ఎదురుపక్షము వారువచ్చి వకాలతు యిచ్చి నారంటే నామీద మాటలేదు సుమండి.
శెట్టి:--స్వామి! స్వామి!! స్వామి!!! ఇదొ 50 రూపాయిల నోటు తీసుకోండి. మిగతాది, చిన్నొడు పల్లెకుపొయి నాడు. వచ్చిన తరువాత హాజరు చేసికొంటాను.
బీమ:--మగతాది వచ్చేవరకు, కట్టనుముట్టరు. (అని శెట్టివారుచేత నుంచి కట్టతీసుకొని బీమసేనరావు లేచును. శెట్టి దండ,ముపెట్టి పొవును. బీమదేవరావు నోటుతీసుకొని డెస్కులోపెట్టి బీగము వేయుచూ--
"అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం,
లోకాభిరామం శ్రీరామం భూయోభూఓపమామ్యహు"
అనిగట్టిగ చదువుచుండగా తెరపడును)