పుట:Sarada Lekhalu Vol 1.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

సరము లేదు. మొదటివారు, 'దర్బారు' పత్రికాధిపతులు; రెండవవారు, 'ధర్మసాధనీ' నేతలు; మూడవవారొక డి|| బోర్డు హైస్కూలులో నుపాధ్యాయులు; నాలవవారు ప్రకృతి చికిత్సాయోగ సాధకులు; పూర్వము బందరు జాతీయ కళాశాలలో నధ్యాపకులుగా నుండినవారు; ఐదవవారు ప్రస్తుతము బాపట్ల పోస్టుమాస్టరుగా నున్నారు. ఇఁక నీ వరలక్ష్మమ్మగారియక్క, అచ్యుతుని వారికోడలు, స్వర్గస్థురాలై నది. ఆమె కిద్దరాడుపిల్లలు. చెల్లెలు, భీమరాజువారి కోడలు; తెనాలిలో నిపుడు మేజస్ట్రీలుగా నున్న శ్రీయుత శ్రీనివాసరావుగారి ధర్మపత్ని.

ఈ మనసహోదరి శ్రీమతి వరలక్ష్మమ్మ గారు. * 6-10-1896 తేదీని జన్మించెను. ఈయమకు సం 1909 గ్రమునఁ బెండిలియైనది. ఆ త్తవారు కనుప ర్డివారు, ఆర్వేలవారు, కాశ్వససగోత్రులు; బాపట్ల తాల్లూకా పందిళ్లపల్లి గ్రామ స్థులును కరణీకోద్యోగులు. -ఈమె య తగారి పేరు ఆదెమ్మ గారు; మామగారి పేరు, రఘుపతిరావుగారు. "ఈ రఘుపతి రాయదంపతులు, తమ బిడల విద్యాభివృద్దికొరకుఁ బూర్వా රැයි 0 గతమైన యాగామకరణీకమును మానుకొని బాపట్లకు CYD వచ్చిరి. వీరికి నలుగురు పుత్రులును, నౌక కొమా రెయు గలిగిరి. వీరిలో హనుమంతరావుగారు మూడవ గ్రామాలు ఈయన యే మన వరలక్మమ్మగారి భర్త. వీ రారోగ్యశాఖ