పుట:Sarada Lekhalu Vol 1.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



విజ్ఞప్తి

1921 - 22 సంవత్సరముల ప్రాంతమున నాంధ్ర పత్రికలో చక్కని శైలితో రమణీయములగు భావములతో వసంత లేఖలు, పచురింపబడుచుండెడివి. వానిని చదువు చుండ నిదేమాదిరిగా స్త్రీలకు సంబంధించిన విషయములను గూర్చి లేఖలు (వాయవలయునని నాకుగూడ కుతూహలము గలిగెను. వెంటనే యొక లేఖనువ్రాసి శ్రీమతి కళ్లేపల్లి వెంకట రమణమ్మగారి యాధిపత్యమున నెలువడిన 'ఆంధ్రలక్ష్మి ' యను స్త్రీమాసపత్రికకు బంపితిని. ఆ పత్రిక నడచినంతకాలము నా శారద లేఖలు గూడ నందు క్రమముదప్పక ప్రచురింపబడు చుండెను. అది ఆగిపోవుటతో నా లేఖలును ఆగిపోయెను. తదుపరి శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మగారి 'అనసూయ ' పత్రిక పునరుద్ధరింపబడగా వారి కోర్కెపై ని యందును రెండు మూడు లేఖలు వ్రాసితిని, తరువాత నదియు నాగిపోయెను.

తదుపరి 1928వ సంవత్సరమునందు 'గృహలక్ష్మీ ' ప్రకటింపబడ నున్నపుడు ప్రతికాధిపతులు నావ్యాసములను కోరగా 'శారద లేఖ 'లను వ్రాసెదనని తెల్పి యట్టులనే వ్రాసి పంపితిని. నాటినుండి నేటివఱకు నా లేఖలను నడపభారము 'గృహలక్ష్మి'యే వహించియున్నది.

దేవతావల్లరియైన కల్పలతవలెనే నా లేఖలును చిరకాలము వర్ధిల్లవలయునను తలంపుతోడను, కల్పలతవలెనే నా లేఖలును స్త్రీలయ భీష్టప్రదాయినులుగా నుండవలయునను తలంప తోడను, నాలతకు నెల్లప్పడు పూచినపూవులుగా నా లేఖలు