Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/841

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఛత్రపతి శివాజీ మహారాజు

చిత్రము - 223

పటము - 2

శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు - సమర్థరామదాసు

స్వారియందును, ఖడ్గచాలనము నందును, నైపుణ్యము అలవడునట్లు చేసెను.

అక్బరు, హైదరలీ, రణజిత్ సింగ్ మున్నగు మధ్యయుగ వీరుల వలెనే శివాజీ నిరక్షరాస్యుడని చారిత్రకు లూహించుచున్నారు. శివాజీ స్వహస్తలిఖిత మైన పత్ర మొక్కటియును లబ్ధము కాలేదు. కాని అతడు రామాయణ, మహాభారత గాథలను విని, ధర్మాభిరతి, త్యాగము రాజ్యనిర్వహణ విధానము, ఆహవ పాటవము, రాజనీతి మొదలగు విశేషములను క్షుణ్ణముగా నెరిగినవాడై యుండెను. అత డెచ్చటికి బోయినను హిందూ, ముస్లిం భక్తులు పాడిన పాటలు వినియును, పురాణ, కీర్తన, భజన కాలక్షేపములందు పాల్గొనియును, అనేక ధర్మ రహస్యములను, సూక్ష్మములను తెలిసికొనుచుండెను. ఈ కారణముచేతనే, గ్రంథావలోకనము లేకపోయినను, కర్మవీరుడుగ, రాజ్యపాలనాదక్షుడుగ అతడు కృతకృత్యుడు కాగలిగెను. మధ్యయుగమునందు నేతృత్వమునకు కావలసినది కర్తవ్యానురక్తి యే కాని, భావశబలత, పాండిత్యములు కావు.

పూనాకు పశ్చిమదిశయందు పడమటి కనుమలలో 90 మైళ్ళ పొడవును, 12 నుండి 24 మైళ్ళ వెడల్పునుగల ఒక లోయప్రాంత మున్నది. ఈ ప్రాంతమునే మావళ్ (సూర్యు డస్తమించు భూమి) అందురు. ఈ ప్రాంతమున ఎన్నియో లోయలు, చిట్టడవులు ఉన్నవి. ఉత్తరదిశ నుండు లోయలలోని జనము కోలీలు. దక్షిణదిశయం దుండువారు మరాఠాలు. ఈ రెండు జాతులవారు మిక్కిలి ఉత్సాహవంతులు, దృఢకాయులు, వ్యవసాయకులు, నిరాడంబరులు, వ్యసన రహితులు. ఈ గ్రామములలో రాజప్రతినిధులు 'దేశ్ ముఖ్' లనబడువారు 'పాటిల్' అను గ్రామాధికారులనుండి రాజస్వము, పన్నులను సేకరించు చుండిరి. ఈ దేశముఖ్ లు మరాఠాలు, శివాజీ జాతివారు. వీరు బ్రాహ్మణు

చిత్రము - 224

పటము - 3 శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు

{c|{773}}