Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/822

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చైనాదేశము (చ)

గుర్తించిరి గాని చైనాలో తమకు గల హక్కులను త్యజింప నిరాకరించిరి. శాంతి, ప్రజాస్వామ్యములలో పాశ్చాత్యుల విశ్వాసమును చైనీయులు అనుమానింప సాగిరి.

కూమిన్ టాంగ్ – సోవియట్ రష్యా సహకారము : సన్ యట్ సేన్ షాంఘైలో నున్న కాలమున సోవియట్ రష్యాతో సహాయ సంప్రదింపులు జరిపెను. 1917 లో లెనిన్ నాయకత్వమున రష్యాలో స్థాపితమైన సామ్యవాద ప్రభుత్వము సామ్రాజ్యవాదమును ఖండించి, పీడిత ప్రజ లకు ఆశాజ్యోతి యైనది. అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీని స్థాపించి, ప్రపంచములోని సామ్రాజ్యవాద వ్యతి రేకులకును, శ్రామిక వర్గములకును సహాయము చేయ లెనిన్ నిశ్చయించెను. సోవియట్ ప్రతినిధియైన అబ్రహాం అడాల్ఫుజోఫి షాంఘైలో సన్యట్ సేన్తో సంప్రదించి చైనాకు రష్యా సహాయమొనర్చునని వాగ్దాన మొనర్చెను. మే, 1920 లో, చన్ ట్యు హ్సి అను పీకింగ్ విశ్వవిద్యా లయాచార్యుని నాయకత్వమున, షాంఘైలో చైనా కమ్యూనిస్టుపార్టీ స్థాపింపబడినది. 1923 జూన్ లో జరిగిన మహాసభలో కమ్యూనిస్టులు సన్యట్ సేన్తోతో పొత్తు కలియుటకు నిర్ణయించిరి. సన్యట్ నేను కూడ రష్యా సహాయముతో విదేశ సామ్రాజ్యవాదులను పారద్రోలి చైనాలో ఆర్థిక సమానత్వముపై ఋజువైన ప్రజా స్వామ్య ప్రభుత్వమును స్థాపించుటకు సంకల్పించెను.

చైనా సమైక్యమునకు ప్రయత్నము : సనాయట్ సేను అనుచరులలో వాంగ్ చింగ్ పై, చియాంగ్ కేషేక్ అను వారు ముఖ్యులు. అందు, చియాంగ్ కేషేక్ 1923 లో సైన్యమును సమకూర్చుకొని, కాన్స్టన్ లోని సైనిక ప్రభువును పారద్రోలెను. సన్యట్ సేన్ తిరిగి కాన్ టన్ ప్రభుత్వమున కధ్యకు డయ్యెను. 1924 లో జరిగిన అఖిల చైనా కూమిన్ టాంగ్ మహాసభకు మావ్ సే టుంగ్ మున్నగు కమ్యూనిస్టు నాయకులు కూడ హాజరై సన్ ్యట్ సేన్ తో సహకరింప సమ్మతించిరి. ఇదే సమయమున కాన్స్టన్ ప్రభుత్వమునకు సహాయ మొన ర్చుటకై రష్యానుండి 70 మంది సేనానులతో మైకేల్ బొరోడిన్ పంపబడెను. చైనా విప్లవకారులను తర్ఫీదు చేయుటకై వాంపోవా సైనిక పాఠశాల స్థాపింపబడెను. 754 సంగ్రహ ఆంధ్ర మే, 1924 లో మంచూరియా, తూర్పు చైనాలలో, తన హక్కులను రష్యా త్యజించుటచేత, చైనీయులకు రష్యా పట్ల గౌరవ మినుమడించెను.

ఇట్టి పరిస్థితులలో పీకింగ్ లోని సైనిక ప్రభువుల మధ్య కలహము లారంభ మైనవి. మంచూరియా నాయకుడైన చాంగ్ సోలిన్ పీకింగ్ నుండి వూ పైపును వెడలగొట్టి, ట్యాంచిజుయిని అధ్యక్షునిగా నొనర్చెను. ఈ ఉభయులు కలిసి, సన్యట్ సేను నాహ్వానించి సమైక్య చైనాకు అధ్యక్షుడవు కమ్మని కోరిరి. ఈ ఆహ్వానము నంగీకరించి, సన్ పీకింగ్ చేరెను. కాని తన ఆశయము పూర్తిగా క పూర్వమే, 12_3-25 లో సన్ యట్ నేను మరణించెను. సన్యట్ సేను చైనా జాతి పితగా భావింపబడుచున్నాడు. కాని, అతడు నిర్దుష్టమై ప్రగతి శీలమైన విధానమును రూపొందించి ఏకాగ్రతతో అవలంబింపలేక పోవుట చేత నే చైనా జాతీయోద్యమము అడ్డదిడ్డముగా నడచెను.

చియాంగ్ కేషేక్ నాయకత్వము సన్ మరణముతో చైనా సమైక్యమునకు అవకాశములు సన్నగిల్లెను. ఉత్తరమున సైనిక ప్రభువులమధ్య కలహములు తిరిగి చెల రే గెను. పీకింగ్ లో చాంగ్ ్సలిన్ అధ్యక్షుడై నాడు. కొన్నికొన్ని రాష్ట్రములలో వూపైపు, మరికొన్నింటిలో ఫెంగ్ సేనాని అధికారము వహించిరి.

కాన్ టన్ లోని కూమిన్ టాంగ్ ప్రభుత్వమునకు వాంగ్ చింగ్ పై అధ్యకుడయ్యెను. చియాంగ్ కే షేక్, లియోచంగ్ కే అనువారు ఆతని సలహాదారు లైరి. రష్యా ప్రతినిధియైన బోరోడిన్ కూడ కాన్టన్ ప్రభుత్వమునకు తోడ్పడుచుం డెను.

ఉత్తరదండయాత్ర : ఉత్తరరాష్ట్రములను జయించి చై నాను సమైక్యమొనర్చుటకై, కాంటన్ ప్రభుత్వము, చియాంగ్ కే షేకును సర్వసై న్యాధిపతిగా నియమించెను. జులై, 1926 లో ప్రారంభ మైన ఈ దండయాత్రకు కమ్యూనిస్టులేగాక, ఉత్తర రాష్ట్ర ప్రజలు కూడ హృదయ పూర్వకముగ తోడ్పడిరి. మార్చి 1927 నాటికే వూహాన్, హూనన్, హ్యుÉ, కియాంగ్సీ, ఫూకిన్, చిక్ యాంగ్ రాష్ట్రములు, నాన్ కింగ్ నగరము, చియాంగ్ వశమై నవి. డిసెంబర్ 1927 లో కూమిన్టింగ్ కార్యస్థానము హాంకోకు మార్చబడెను. హాంకోలోని తమ హక్కులను