Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/772

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చిలీ దేశము 710 సంగ్రహ ఆంధ్ర

వక్తగను, చిత్తశుద్ధి, అచంచల దీక్ష గల సంఘ సేవకుడు గను, నిర్వాహకుడుగను ఎన్నిక గనిరి.

1893 వ సంవత్సరమున పురాణపండ వేంకట దీక్షి తులుగారి తనయ వెంకాయమ్మతో వీరికి వివాహమైనది. కాని సంతానము కలుగలేదు. అయితే, అప్పచెల్లెండ్ర యొక్కయు, తమ్ముని యొక్కయు సంసారములను వీ రే నిర్వహించిరి. బడినది.

వీరి స్వీయచరిత్రము కూడ ఇటీవలెనే ప్రచురింప “భరతఖండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి గొల్ల వారు పిదుకుచున్నారు మూతులు బిగియగట్టి"

అను వీరి పద్యము వీరి జాతీయాభిమానమునకును, 'అల్లుడా రమ్మని ఆదరమ్మున బిల్వబంపు' అను పద్యము వీరి ఉజ్జ్వల నాటక రచనమునకును, 'ముదితల్ నేరగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్' అను పద్యము వీరి స్త్రీ విద్యాభిరతికిని పేరుబడసి ప్రజలలో మిక్కిలి ప్రచారము నొంది, వీరిని ప్రజా కవిగా తీర్చిదిద్దినవి.

ఈ మహావ్యక్తి 1947 సం. జూను 17వ తేదీనాడస్తమించెను.

ఊ. ల.

చిలీ దేశము :

దక్షిణ అమెరికాలో బహుకాలముగా ఘటిల్లిన విప్ల వములను, కలహములను బట్టి చూడగా, 'చిలీ' తరతమ భావముచే ప్రశాంతమగు చరిత్రగల దేశమనవచ్చును. కాని అది ఇటీవలి కాలమున తరచుగా సంభవించుచు వచ్చిన కార్మిక కలహముల కారణముగా గొప్ప ఇక్కట్టు లకు గురియైనది,

క్రీ. శ. 1536 వ సంవత్సరమున ప్రప్రథమముగా యూరపియనులు చిలీ దేశమున దిగిరి. డైగో డీ ఆల్ మగ్రో (Diego de Almagro) అను నతడు ఆ సమ యమున ' పెరూ' (Peru) నుండి చిలీపై దండయాత్రచేసి విఫలమనోరథుడయ్యెను. అయిదు సంవత్సరముల అనం తరము పెడ్రో డీ వాల్ డివియా (Pedro de Val- divia) అను మరియొక స్పెయిన్ దేశీయుడు సాంటి యాగో (Santiago) ను స్థాపించెను. 1810 వ సంవత్స రము సెప్టెంబరు 18 వ తేదీన చిలీ దేశీయులు స్పెయిన్ ఆధిపత్యముపై తిరుగబడిరి. కాని వారికి 1818 వ సంవత్స రము వరకు సంపూర్ణ స్వాతంత్ర్యము లభింపకుం డెను. ఆ సంవత్సరమున బెర్ నార్డో ఓ హిగ్గిన్స్ (Bernardo o Higgins), జోస్ డీ సాన్ మార్టిన్ (Jose de san Martin) అనువారు తుదకు స్పానిష్ సైన్యములను అణగద్రొక్కిరి.

చిలీ ఎన్నడును యుద్ధమున పరాజయ మొందిన దేశము కాదు. దానికిని బొలివియా (Bolivia). పెరు (Peru) లకును నడుమ 1879-83 సంవత్సరముల మధ్య కాలమున యుద్ధము సంభవించెను. ఆ యుద్ధములో 'ఆన్టో ఫాగస్టా' (Anto Fagasta) అను పేరుతో బొలివియాకు గల ఏకైక సముద్రమార్గమున్న రాష్ట్ర మును, దానితోపాటు, పెరుకు చెందిన విశాల భూభా గములును చిలీ కైవసమయ్యెను. మొదటి ప్రపంచ మహాసం గ్రామమందు చిలీ తటస్థముగానుండెను. 1927 వ సంవత్సరమున కర్నల్ కార్లోస్ ఇ ఫియజ్ (Colonel Carlos Ibafiez) అనునతడు అధికారమును తన హ స్త గత మొనర్చుకొనెను. అతనికి 1931 వ సంవత్సరమున పతనము సంభవించెను. అతని పతనమునకు అనంతరము కొలది కాలమువరకు అరాజకపరిస్థితులేర్పడెను. ఆ స్వల్ప కాలమునందే ఏద్గురు వ్యక్తులు దేశాధ్యములగుటయు, తిరిగి పదభ్రష్టులగుటయు గూడ తటస్థించెను. కాని డా. ఆర్టురో అలెస్సాండ్రీ (Dr. Arturo Alessandri) 1982-88 సంవత్సరము మధ్యకాలములో చిలీ యొక్క రాజకీయ, ఆర్థిక స్థైర్యమును నెలకొల్పుటకు గొప్ప ప్రయత్న మొన ర్చెను.

1938 వ సంవత్సరమున జరిగిన ఎన్నికలలో విజయు డైన పెడ్రో ఆగ్విరే సెర్ డా (Pedro Auguirre Cerda) అను నతడు 1941 నవంబరు 25 వ తేదీన మరణించెను. ఇతడు తన మరణమునకు పూర్వమే విపులమైన ఒక సామ్యవాద ప్రణాళికను దేశములో ప్రవేశ పెట్టెను. 1942 సం. లో 'ప్రజాపక్షము'న (popular Front) తీవ్రవాదియైన జువాన్ ఆన్ టోనియా రియోస్ (Juan Antonio Rios) అభ్యర్థిగా ఎన్నుకొనబడెను. ఆతని