Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/759

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 388 88 697 చిన్నయసూరి పరవస్తు

వారి యింటి పేరు. 'సూరి' అతని బిరుదము. 'చిన్నయ' యనునది ఆతని పేరు. చిన్నయసూరి మదరాను రాష్ట్రము నందలి చెంగల్పట్టు జిల్లాలో శ్రీ పెరుంబుదూరు గ్రామ మున క్రీ. శ. 1808 వ సంవత్సరమున జన్మిం చెను. చిన్నయసూరి తండ్రి పరవస్తు వేంకటరంగయ్య, తల్లి శ్రీనివాసాంబ. వీరు తమిళదేశమున స్థిరనివాసము కల ఆంధ్రులు. పరవస్తువారు చాత్తాద (సాతాని) వైష్ణవులు.

చిన్నయసూరి బాల్యమున విద్యాభ్యాసమునందు కొంతకాలము శ్రద్ధలేక అల్లరిచిల్లరగా తిరిగినను, తరు వాత అమిత శ్రద్ధాసంక్తులతో తన తండ్రియొద్దను, శ్రీ కంచి రామానుజాచార్యుల యొద్దను, శ్రీ రామ శాస్త్రులను విద్వాంసునికడను విద్యాభ్యాసము గావించి, వ్యాకరణ, తర్క, మీమాంసాలంకారాది శాస్త్రము వేదమునందును చక్కని పరిచయమును సంపాదించెను. సంస్కృతాంధ్ర ప్రాకృతములందును, అరవమునందును చిన్నయ గొప్ప పరిశ్రమగావించి, వాని యందు చక్కని పాండిత్యము సంపాదించుకొ నెను. ఇంతేకాక చిన్నయసూరి, తరువాతి కాలమున ఆంగ్ల భాషను గూడ కొంత నేర్చికొనియెను. చిన్నయసూరి చిరుతవయసుననే మంచి పాండిత్యమును సంపాదించు కొనుటయే కాక, హయగ్రీవ మంత్రోపాసకుడై దైవ బలమును గూడ సంపాదించెను.

చిన్నయసూరి తండ్రిగారు చెన్నపురిలో అప్పటి ప్రభు త్వముచేత న్యాయాధికారులుగా నియమింపబడినం దున, సూరియు వారితోపాటుగా మదరాసు చేరుకొనెను. కొంత కాలమునకు సూరిగారి జనకులు మరణించిరి. అప్పుడు చిన్నయసూరి ఉద్యోగమునకయి వెదుక నారం భించెను. మొదట నాతనికి చెన్నపురిలో అప్పను మిషన్ పాఠశాలయందు కొలదిపాటి వేతనముగల యొక చిన్న యుపాధ్యాయ పదవి లభించెను. మరియొక వైపు సూరి తనకున్న కొలదిపాటి యాంగ్లభాషా పరిచయముతో తెలుగు భాషను బోధించు క్రిష్టియను మిషనరీలకు చుండెను. ఇంకొకవైపు పండితపరీక్షలకు వెళ్ళు వారికి వేరుగా భాషా విషయములను బోధించుచుండెను. తరువాత కొన్ని నాళ్ళకు సూరి పచ్చయప్ప పాఠశాల నియమింపబడి యెను. అప్పటి యందు పండితుడుగా

కాలేదు. కింకను మదరాసు విశ్వవిద్యాలయము స్థాపితము కా ఆ పిదప పది సంవత్సరములకు మదరాసు విశ్వవిద్యా లయమును, దానితోపాటుగా నేటి మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలయు అవతరించెను. చిన్నయసూరి ఆ కళాశాల యందు పండితులుగా నియమింపబడి, 1861 వ సంవత్స రము వరకును అచటనే ఆ యుద్యోగమున నుండిరి. ప్రెసిడెన్సీ కళాశాలయే మదరాసు విశ్వవిద్యాలయము నకు ముఖ్య కళాశాల కనుక, చిన్నయసూరియే మద రాసు విశ్వవిద్యాలయ ప్రధాన పండితులుగా పరిగణింప బడుచుండిరి. ఆ నాడు మొదట ప్రెసిడెన్సీ కళాశాలకు అధ్యక్షుడుగను, తరువాత మదరాసు విశ్వవిద్యాలయ కార్యదర్శిగను నుండిన ఏ. జే. ఆర్బత్ ్నట్ దొరయే చిన్నయ పాండిత్య విశేషములు కలరి యను బిరుదమును, తత్సూచకమగు సువర్ణ పతక మును బహూకరించిరట ! నాడు మొదలు చిన్నయ 'చిన్నయ సూరి' యయ్యెను. 1861 సం.న రాచపుండు పుట్టి సూరి కళాశాలోద్యోగమును పదలివేయవలసివచ్చెను. ఆ మరు సటి సంవత్సరమే యాతడు జీవయాత్ర చాలించెను ఇది యాతని సంగ్రహ జీవితము. ఇక చిన్నయసూరి రచన ములను గూర్చి పరిశీలింతము. వారికి 'సూరి'

చిన్నయసూరి పేరు తలచినంతనే, మనకు స్ఫురించు నవి ఆతని 'బాలవ్యాకరణము, నీతిచంద్రికలు ' సూరి బాలవ్యాకరణము 1858 వ సం. మొదటి మారుగా ముద్రితమయి ప్రక టింపబడియెను. నీతి చంద్రిక యంతకు ముందే 1853 వ సం.న రచితమయి ప్రకటింపబడినది. చిన్నయసూరి కీర్తిని ఆంధ్రవాఙ్మయ చరిత్రమున శాశ్వ తముగా నిలుపునవి పై రెండు గ్రంథములే యనుటలో సందేహము లేకపోయినను, సూరి రచించిన ఉత్తమ గ్రంథము లింకను బెక్కులుగలవు. చింతామణి వృత్తి, పద్యాంధ్రవ్యాకరణము, సంస్కృతసూత్రాంధ్ర వ్యాక ర ణము, శబ్దలక్షణ సంగ్రహము, విభక్తి బోధిని, ఆంధ్ర ధాతుమాల, అక్షరగుచ్ఛము, ఆంధ్రశబ్దశాసపము, బాల వ్యాకరణము, బాలవ్యాకరణ శేషము, ఆంధ్ర కౌముది యనునవి సూరి వ్యాకరణ రచన అయినట్లు తెలియు చున్నది. ఇదికాక ఆదిపర్వవచనము, నీతి చంద్రిక, ఆంధ్ర కాదంబరి, ఇంగ్లీషు లా చట్టములు భాషాంతరీక రణము,