Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతురంగబలములు - 1

సంగ్రహ ఆంధ్ర


నా౽౽కర్ణయ సద్యస్సంభృత మాధుర్యాణి పరిణా
మా౽నర్థ ధుర్యాణి కుజన భాషణాని, సంపాదయ
సుజనానురాగం." (7 ఉ.)

ఇంద్రాదులు తారకాసురబాధితులై బ్రహ్మదర్శనార్థ మేగిరి. ఆ సమయమున వాడిన ముఖకాంతి గలవారి క్షేమాదికమును బ్రహ్మ పరామర్శించును. ఆ పట్టునందలి


బతవో వదనాని సాంప్రతం
సుతరాముజ్ఘిత నైజదీప్తితః
తపనాంశుపరీత దీధితేః
సితభానో రుపయాంతి దీనతాం.

అను పద్యము కాళిదాసీయ కుమారసంభవమునందు తాదృశ సందర్భమునందే కనిపించు


కిమిదం ద్యుతిమాత్మీయాం
న బిభ్రతి యథాపురా
హిమక్లిష్ట ప్రకాశాని
జ్యోతీంషీవ ముఖాని వః.

అను పద్యమునకు ప్రతిబింబమయి ఈకవి కవిత్వముపై ప్రసరించిన కాళిదాస కవితా ప్రభావమును వెల్లడి చేయు చున్నది. కవి రచన మిక్కిలి ప్రౌఢమును సరసమును సాలంకృతమునై వెలుగొందుచున్నది. సంస్కృత గద్య పద్యసంధానమున సవ్యసాచి ఈమహాకవి. ఆసూరి అనంతాచార్యులు 1868 వ సంవత్సరమున నిర్మించిన 'చంపూ రాఘవ' మొకటి కలదు. శొంఠి భద్రాద్రిరామశాస్త్రి (1856 - 1915) రచించిన 'శంబరాసుర విజయ' మను చంపువు పేర్కొనదగినది. ఈకవి ఉర్లాం, లక్కవరం జమీందారుల ఆస్థానపండితుడుగా నుండెను. ఇతడు గంగా రామయల తనూజుడు. పిఠావురనివాసి. వెలనాటివైదిక బ్రాహ్మణుడు. ఈ చంపువునందు కవి అనన్య సామాన్య మయిన సారస్వత కలా కౌశలమును ప్రదర్శించెను. క్రీ. శ. 1840 - 1900 వరకు గద్వాల సంస్థానమును పరిపాలించిన రాజా రామభూపాలుని విద్యాగురువులగు పురాణం దీక్షాచార్యులవారు 'రామాయణ చంపువు'ను నిర్మించినట్లు విదితమగుచున్నది. 20 వ శతాబ్ది పూర్వార్థమున నున్న మహాపండితులు కిళాంబి గోపాల కృష్ణమాచార్యులవారు వ్రాసిన 'శోభనాద్రీశవైభవ చంపువు' ప్రశస్తమైనది.

ఇట్లు సంస్కృత చంపూకావ్యరంగమున మహాకవుల హాటక లేఖినులు బహుముఖముల, బహువిధ చిత్రభూమికలతో, లీలానర్తన మొనర్చి, కావ్యజ్ఞుల చిత్తముల నాకర్షించినవి. సంస్కృతకవులు చంపూకావ్యమును ఉత్తమసాధనముగ గొని సాధించిన ప్రయోజనములు బహుళములు. సంస్కృత చంపూకావ్యములలో కొన్ని పరిణయకథాత్మకములై మతప్రచారోద్దిష్టములై పెంపు మీరినవి. చంపువులో అనేకములు, శ్రీమద్రామాయణ - భారత - భాగవతకథా ప్రతిపాదకములై, భక్తిబోధకములై, అశేషజనుల చిత్తములను చూరగొనినవి. శేషించిన చంపువులలో కొన్ని చరిత్రాత్మకములై, పెక్కులు అభీష్టదేవతామాహాత్మ్య ప్రతిపాదకములై, కొన్ని మహాపురుష జీవిత కీర్తనపరములై, కొన్ని సంఘసంకరణోద్దిష్టములై, కతిపయములు తీర్థ క్షేత్ర మహత్త్వ బోధకములై, అల్పసంఖ్యాకములు ఆయాకవుల దేశాభిమాన సూచకములై, ఆత్మీయకథాంశద్యోతకములై, ఛందో౽ లంకారోదాహరణాత్మకములై, శోభిల్లినవి. వాద్యకలామిశ్రితగీతివలె సరససాలంకార గద్యపద్య సమ్మిశ్రితమైన చంపూకావ్యము, భిన్నరుచి విశిష్టులగు పాఠకుల కెల్లరకును ఏక సమారాధక మైనది. (గద్యానుబంధరసమిశ్రిత పద్యసూక్తిః, హృద్యాహివాద్యకలయా కలితేవ గీతిః-భోజుడు) కావుననే సంస్కృత చంపూకావ్యము


'ఉదాత్త నాయకో పేతా
గుణవద్వృత్తముక్తకా
చంపూశ్చ హారయష్టిశ్చ
కేన నక్రియతే హృది. (నల. చం. ఉ. 1. శ్లో. 14)

అనురీతి విద్వత్ప్రశంసకు పాత్రమైనది.

గ. ల.


చతురంగబలములు - 1:

భారతదేశమునందలి రాజనీతి చతురుపాయవిశిష్టమైనది. సామదాన భేద దండము లనునవి చతురుపాయములు. ఇచటి 'దండ' శబ్దమునకు 'సేన' అని అర్ధము. యుద్ధఫలకములగు రాజకార్యములలో 'సేన' అనునది చివరి ఉపాయము . అట్టి సేన - భారతీయ దండనీతి దృష్టితో రథ - గజ - తురగ - పదాతులను నాలుగు అంగములతో కూడియుండును. వాటికే సేనాంగములు,


592