Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రీసుదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 142

పటము - 4

జ్యూన్ - గ్రీక్ ప్రధాన దేవుడు

లనునిర్మించి, అందు విగ్రహములనుప్రతిష్ఠించి, ఏటేటను ఉత్సవములు జరిపెడివారు. వారికి శకునము లందును, జోస్యము నందును నమ్మిక యుండెను. పరలోకముకలదని గ్రీకులువిశ్వసించిరి.

గ్రీకు శిల్పము : గ్రీకులు శిల్పకళను చాల వృద్ధికావించిరి. డిలాస్ లోగల అపోలో దేవాలయమును, ఏథెన్సు నగర సమీపమున గలపార్థినానుదేవాలయమును, వారి శిల్పకళా కౌశల్యమునకు అత్యుత్తమ నిదర్శనములు. పెరిక్లీసునకు సమకాలికుడయిన ఫిడియస్ అను శిల్పి జ్యూస్ - ఎథీనాల విగ్రహములను సహజసౌందర్య ముట్టిపడునట్లు చెక్కెను. క్రీ. పూ. 3 వ శతాబ్దియందు గ్రీకువాస్తు నిపుణులు 105 అడుగుల ఎత్తుగల కంచు విగ్రహమును సిద్ధముచేసిరి. ఆ విగ్రహపు కాళ్ళక్రిందుగా నౌకలు సయితము నిరాటంకముగా రాకపోకలు జరుపుచుండెనట !

శాస్త్ర విజ్ఞానము: ప్రాచీన కాలమునాటి గ్రీకులు స్వతంత్రాలోచనాపరులు. వారు ప్రతి అంశమును గూర్చియు స్వయముగ ఆలోచించి, సత్యమును గ్రహించెడి వారు. కావున వారిలో శాస్త్రవిజ్ఞానము చక్కగా పెంపొందెను. వారిలో ఫైథాగరస్, యూక్లిడ్ అను గొప్ప గణిత శాస్త్రజ్ఞులును, ఆర్కెమిడిస్ అను ప్రకృతి శాస్త్రజ్ఞుడును, తదితర శాస్త్రజ్ఞులనేకులును ఉద్భవించిరి.

తత్త్వశాస్త్రము : గ్రీకులు మానవజీవితపు లక్ష్యములను గూర్చి తీవ్రముగ విమర్శ చేయజొచ్చిరి. తత్ఫలితముగ స్టోయిక్, ఎపిక్యూరియన్ అను తత్త్వశాఖలు వీరిలో తలయెత్తెను. కోర్కెలను జయించి శమదమాది గుణములను అలవరచు కొనుటయే జీవితమునకు పరమ లక్ష్యమని స్టోయిక్కుల భావము. దేహసౌఖ్యమే జీవిత పరమలక్ష్య మని ఎపిక్యూరియనులు భావించిరి. భౌతికవాదులు జీవితమే పరమసత్యమనియు, పునర్జన్మమనునది లేదనియు మరణమే జీవిత చరమావధియనియు బోధించిరి. కాని చార్వాకుల వలెనే ఎపిక్యూరియనులు కూడ సామాజిక వ్యవస్థకు నీతిప్రధానమని చాటిరి. క్రీ. పూ. 5 వ శతాబ్ది నుండి సోఫిస్టులు అను సంచారోపాధ్యాయులు, శాస్త్ర విజ్ఞానమును, తాత్త్విక సిద్ధాంతమును, ప్రజలకు బోధింప సాగిరి. గ్రీకు తత్త్వజ్ఞులలో సర్వ శ్రేష్ఠుడుగా సోక్రటీసు (క్రీ. పూ. 469-399) పరిగణింపబడెను. ఇతడు "ప్రశ్న-

చిత్రము - 143

పటము - 5

గ్రీకుల అపాలో దేవత

526