విజ్ఞానకోశము - 3
గోలకొండ పట్టణము
చిత్రము - 123
పటము - 2
బాలాహిస్సార్ మరియు ఇబ్రహీం కుతుబ్షా నిర్మించిన మశీదు
సుల్తాను కులీ మొదట గోలకొండ పరిసరములందుగల ఒకానొక ప్రాంతమును ప్రధానకేంద్రముగ గ్రహించినట్లు తెలియుచున్నది. కాని సుల్తాన్కులీ, గోలకొండదుర్గము, నగరము నిర్మింపబడిన తరువాతనే స్వాతంత్య్రమును ప్రకటించు కొన్నట్లు చరిత్రకారులు అభిప్రాయపడుచున్నారు. ఇతడు క్రీ. శ. 1518 లో స్వతంత్రుడయ్యెను. కావున గోలకొండ దుర్గముతోపాటు గోలకొండ నగరస్థాపనము కూడ 1518 వ సంవత్సరమునకు ముందే జరగెనని నిర్ణయించుటయే సమంజస మగుచున్నది. కులీసుల్తానునకు వశముకాకపూర్వము గోలకొండ, చాళుక్యులయొక్కయు, కాకతీయులయొక్కయు అధీనమున నుండెను. ఈదుర్గము తెలంగాణమునకు కేంద్రస్థానమున లేకుండినను, శత్రువుల దండయాత్రలను కనిపెట్టుటకు రక్షణ దృష్టిచే ప్రాధాన్యమును వహించి యుండెనని మాత్రము చెప్పవచ్చును.
సుల్తాను కులీ గోలకొండ దుర్గమును, నగరమును విస్తృతపరచుటకు తగిన ప్రయత్నము లొనర్చెను. ఆతని అనంతరము గోలకొండ సామ్రాజ్య పాలన భారమును వహించిన సుల్తానులు నగరాభివృద్ధికై కృషి సల్పిరి. సుల్తాన్ కులీ కాలమునను, తదనంతరము కొంతకాలము వరకును, గొలకొండ ప్రభువులు తమ రాజ్యమును సుస్థిర పరచుకొనుటయందు అధిక మైన శ్రద్ధను వహించిరి. కొంత కాలమైన తరువాత సుల్తానుల దృష్టి నగరాభివృద్ధిపై కేంద్రీకృత మయ్యెను. కులీ కుతుబుషా, ఇబ్రహీం కుతుబుషా, మహ్మద్ కులీ కుతుబుషా, అబ్దుల్లా కుతుబుషా మొదలగు సుల్తానులు గోలకొండ నగరమును సుందరముగ తీర్చిదిద్దుట యందు శ్రద్ధ వహించిరి.
గోలకొండనగర వైశాల్యమును, నగరమునందు నివసించు ప్రజల సంఖ్య మున్నగు వివరములను తెలుపుటకు ఆధారములు స్వల్పముగ నున్నవి. శతాబ్దములు పై బడిన కొలది గోలకొండ నగరము ఎంతయు అభివృద్ధి నొందినది. అది కులీకుతుబుషా నాటికే జనసంకీర్ణమై వేరొక నగర నిర్మాణమునకు దారితీసినది. గోలకొండ నగర వైశాల్యము దినదినము మారుచుండెను. ఈ కారణము వలననే, నగరము హైదరాబాదు వరకు విస్తృతమైనది. గోలకొండనగరము సుల్తానులకు గాని, అచ్చట నివసించు ప్రజలకు గాని చాలని కాలముకూడ వచ్చినది. కొందరు సుల్తానులు గోలకొండను విస్తృత పరచుటయే గాక, క్రొత్త నగరములను, కోటలను నిర్మించుటకు పూను
471