గోండులు
సంగ్రహ ఆంధ్ర
గోండు సామంతరాజ్యముగా పేర్కొనబడినది. ఔరంగజేబు కాలములో ఈ 'చాంద', 'ది యోగర్' అను ప్రదేశములు బీరారు సుబాలో చేర్చివేయబడినవి, మొగలురాజుల కాలములో ఇంచుమించుగా స్వేచ్ఛ ననుభవించిన ఈ రాజ్య స్వాతంత్ర్యము మహారాష్ట్ర విజృంభణముతో అంతమొందినది. 1749 లో 'చాంద' పట్టణము మహారాష్ట్ర సైనికుల ముట్టడికి లొంగిపోయి వారికి స్వాధీనమయ్యెను. మరి రెండు సంవత్సరముల తరువాత ఈ రాజ్యము భోన్ల్సే రాజ్యములో కలిపివేయబడి గోండుల కడపటిరాజు ఖైదీ చేయబడెను. గోండ్వానారాజ్యము హైదరాబాదులోని ఆదిలాబాదు జిల్లాయందలి రాజూరా తాలూకావరకు వ్యాపించియున్నట్లు కనిపించుచున్నది. ఈ రాజ్యములో 'మానిక్గడ్' (మాణిక్యగడము) అను కోట ముఖ్యమైనది
చిత్రము - 115
పటము -1
గోండు రాజులు పర్వతాగ్రమున నిర్మించిన “మాణిక్ ఘర్ దుర్గము" (శిథిలావశేషము - అరణ్యమయము)
గోండులు పాలకజాతిగా నున్నంతవరకు వారి జీవన ప్రమాణము, భౌతికసంపద ఎంతమాత్రము తీసికట్టుగా లేనట్లు కనబడును. అనాగరికులైన గోండులు పలురకములైన ఆహారపదార్థములను సమకూర్చుకొందురు. వారు అడవులనుండి పువ్వులు, పండ్లు, ఆకులు, దుంపలు, మొదలైనవి సమృద్ధిగా సంపాదించెదరు. అట్లే వారి ఆహారమందు చిన్నవి, పెద్దవి పలురకములగు జంతువులుకూడ చేరియున్నవి. గుట్టలయందుండు గోండులు తమ వ్యవసాయమును ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశమునకు మార్చుచు స్వల్ప పరిమాణములలో ధాన్యములను పండించుచున్నారు.
చిత్రము - 116
పటము - 2
గోండు వనిత. బరువుగల వెండినగలు ధరించుట, అందమైన రంగుచీరలను ధరించుట గోండు వనితల కెక్కువ మోజు
గోండులలో రెండు ముఖ్యమైన విభాగము లున్నవి. వాటిలో 'ధూర్వే' గోండులు ఒక తెగ. వీరిపై నాగరకతా ప్రభావము పనిచేయలేదు. వీ రింకను అడవులలోనే యున్నారు. రెండవ తెగవారైన 'రాజ' గోండులు మైదానములలో నివసించుచు వ్యవసాయ భూములను కలిగియున్నారు. వృత్తులను బట్టి గోండులు అనేక విధములగు గుంపులుగా విడివడి యున్నారు. అగరియా (కమ్మరి), ఓఝా, బైజా (సోదె చెప్పువారు), పర్ధాన్ (పురోహితులు), సోలహా (వడ్రంగులు), గౌరి (గొల్లవారు), భుంజియా, ఖైర్వారు, నాగరేటి మొదలైన గుంపులు కలవు.
పల్లెటూరిలో శయన మందిరములఏర్పాటు గోండుల సాంఘికసంస్థ లన్నిటిలో విచిత్రమగు ప్రయోజనకర
440