Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురుమూర్తి శాస్త్రి గీత, ఐనను గీతము, లక్షణగీతము, ప్రబంధము, దరువు, స్వరజతి, తానవర్ణము, పదవర్ణము, పదము, కృతి, కీర్తన, తిల్లా నము, జావళి మొదలైన సంగీత రచనా భేదము లతని కాలమునకే ప్రచారమునకు వచ్చియుండెను. కే సమకాలికు లెల్లరును ప్రబంధ రచనల యందే మిక్కుట ముగ ఆసక్తి గలవారలై ఆ రచనలనే చేయుచుండిరి. క్రీ. శ. 18 వ శ తాబ్దమునందు పురందర విఠల దాసు, 17వ శతాబ్దములో వేంకటమఖి, 18వ శతాబ్దమునందు కవి మాతృభూతయ్య మొదలగువారు గీత, ప్రబంధ రచనా విశేషముల నధికముగా చేసియుండిరి. పురందర విఠలదాసు సంగీత క్రమశిక్షా విధానములతో పిళ్ళారి గీతములు మొదలైన వాటిని రచించియుండెను. క్రీ. శ. 1577 మొదలు 1614 వరకు చోళమండలము నేలిన అచ్యుతప్ప మహారాజును, ఆతని మంత్రియగు గోవింద దీక్షితులును కలిసి అనేక సంగీత గ్రంథములను రచించి యుండిరి. 66 "త్రినా మాద్యంత నామానౌ మహీషి దీక్షితావి భౌ శస్త్రే, శా స్త్రేచ కుళలా వాహవేషు హవేషు. శా సంప్రదాయముగా వ్యవహారములో నుండిన అచ్యుత, అనంత, గోవింద అను మూడు నామములలో మొదటి నామము అచ్యుతప్ప మహారాజు శస్త్రము నందును, యుద్ధమునందును, అంత్యనామము గల గోవింద దీక్షితులు శాస్త్రము నందును, యజ్ఞకర్మ యందును కుళలురని వారి గ్రంథములందు శపథము చేసియుండిరి. అట్టి గోవింద దీక్షితుల ద్వితీయ పుత్రుడును. చతుర్దండి ప్రకాశిక అను మహా గ్రంథమును రచించినవాడును నగు వేంకటమఖి యొక్క గీత, లక్షణాగీత రచనల ననుసరించి గురు మూర్తిశాస్త్రి స్వనామాంకితముగ వేయి గీతములను రచించియుండెను. అందువలన నితనికి "వేయిగీత" అను బిరుదముగూడ లభించినది. సంగీత సాహిత్యము లందును, ఆంగ్ల భాషాద్యనేక భాషలయందును విచక్షణుడై సంగీతభోజుడని బిరుదము వహించిన శ్రీ మణలి చిన్నయ ముదలియారు, శ్రీ గురు మూర్తిశాస్త్రిని రావించి వారి పాండిత్యమును, గీత రచనా చాతుర్యమును తెలిసికొని ముగ్ధుడై అనేక విధ ముల వారిని బహూకరించెను. 402 సంగ్రహ ఆంధ్ర ముత్తుస్వామి దీక్షితులవారి జనకుడును, సంగీత సాహిత్య విశారదుడును నగు శ్రీ రామస్వామి దీక్షితు నకు గురుమూర్తిశాస్త్రి, తన రచనలను వినిపించి వారి మన్ననల నందినట్లును తెలియుచున్నది. ఈ గీత రచనా చాతుర్యమును గూర్చి విన్న సమకాలికులగు విద్వాంసు లును, సంగీత విద్యాసక్తులును ఈ గీతముల నభ్యసించి అనేక విధముల ప్రచారము చేయదొడగిరి. సంగీత రచనా విధానములలో అనేక మార్గముల నవలంబించి రచనలను చేసి సంగీత ప్రపంచమున అపూర్వ సృష్టిక ర్తలుగా విఖ్యాతి నొందిన త్యాగరాజు, ముత్తు స్వామి దీక్షితుడు, శ్యామశాస్త్రి అనువారల రచనా విధానములలో ఇప్పటి సంగీత ప్రపంచము ఊయల లూగుచున్నప్పటికిని శ్రీ గురుమూర్తి శాస్త్రి విరచితము లయిన గీత రచనలను అభ్యసించని సంగీత విద్వాంసు డుండుట చాల అరుదు. సంగీత విశారదులగు తర్చూరు సింగరాచార్యుల వారు రచించిన గ్రంథములలో “గాయక గాయనీయ పారిజా తము" అనుదానియందును, తదితర గ్రంథములయం దును గురుమూర్తి శాస్త్రి, విరచితములయిన గీతములను కొన్నిం టిని ముద్రించి యున్నారు. అవి ప్రస్తుత కాలమునందు మిక్కిలి ప్రచారములో నున్నవి. గురుమూర్తి శాస్త్రి గీతములే గాక కీర్తనలు గూడ రచించినట్లు తెలియు చున్నది. శ్రీ గురుమూర్తిశాస్త్రివర్యులు రచించిన కొన్ని గీతారంభము లీ దిగువ జూపబడుచున్నవి: గీతారంభము 1. జయకరుణాసింధో 2. గానవిద్యాధురంధర 3. కంసాసుర ఖండన 4. ఆ రేయానక దుందుభి 5. ఆరభి రాగలక్షణం 6. పాహీ శ్రీరామచంద్ర 7. పాలయనా గేశ్వర 8. భువనత్రయ మోహన 9. జానకీరమణ తే నమోనమో (రాగము) (తాళము) ధన్యాసి ధ్రువ నాట ధ్రువ మఠ్య ధ్రువ జ నాట ఆరభి ఆనంద భైరవి ధ్రువ బిలహరి మఠ్య కాంభోజి ధ్రువ నీలాంబరి త్రిపుట ఇట్లనేక రాగతాళములలో గీత - లక్షణ గీతలను రచించి వాసిగాంచి విద్వజ్జన శ్లాఘనీయుడయిన మహా