Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము _ 3 387 గుణగ విజయాదిత్యుడు

గాంగులు లోపలి భాగమునకు పారిపోయి గంగకూటమను చోట తలదాచుకొనిరి. కాని విజయాదిత్యుడు వెంటనంటి పోయి అక్కడకూడ వారిని ఓడించి తిరిగి రాష్ట్రకూటుల ఆధిపత్యమును వారు అంగీకరించునట్లు చేసెను

ఈ దండయాత్ర ముగిసినతరువాత రాజధానికి తిరిగి వచ్చి కొంత కాలమువరకు విజయాదిత్యుడు తన రాజ్య వ్యవహారములలో నిమగ్నుడయ్యెను. క్రీ శ. 800 సం. లో అమోఘవర్షుడు మరణించగా రెండవకృష్ణుడు రాష్ట్ర కూట రాజ్యమునకు ఏలిక అయ్యెను. ఇది జరిగిన కొన్ని రోజులకే ఘూర్జర ప్రతీహారవంశపు రాజైన భోజుడు రాష్ట్రకూట రాజ్యముమీద దండెత్తివచ్చి మాలవ రాష్ట్ర మును వశపరచుకొ నెను . పూర్వము అమోఘవర్షుని కాలములో తనకు జరగిన అవమానమునకు ప్రతీకారము చేయుటక తగిన సమయముకొరకు వేచియున్న విజయాదిత్యుడు, కృష్ణరాజునకు ఈ విధముగా కలిగిన కష్టమును పురస్కరించుకొని స్వాతంత్ర్యము ప్రకటిం చెను. పాండురంగ సేనానిని రాష్ట్రకూటులపై దండుతో పంపించెను. కృష్ణరాజునకు ఈ సమయములో, అతని బావమరదియు, దాహళ మండలమునకు రాజును అయిన సంకిలుడు బాసటగా నిలిచెను కాని వీరిద్దరు కలిసికూడ వేంగీచాళుక్య సైన్యముల ధాటికి తట్టుకొనలేక పోయిరి. ఈ విధముగా ఓడిపోయి కృష్ణరాజు తన రాజ్యమును సహితము వదలి పెట్టి దాహళమండలములో తలదాచు కొనెను. ఈలోగా ద్రవిడ దేశములో ఒక ఉపద్రవము సంభవించెను. అక్కడి చోళరాజు ఒకడు - పాండ్య, పల్లవ రాజుల వత్తిడికి తట్టుకొనలేక గుణగ విజయాదిత్యుని సహాయమును అర్థించెను. ఈచోళ రాజునకు సహాయార్థము విజయాదిత్యుడు సైన్యమును పంపించి పాండ్య పల్లవ రాజులను ఓడించి వారివద్దనుండి అపారధనమును సంపా దించెను.

తరువాత విజయాదిత్యుడు రాష్ట్రకూటులమీద మరి యొక దండయాత్ర సాగించెను. ఈ యాత్రలో వేంగీ చాళుక్య సైన్యములు కళింగ దేశములో నుండియు, కళింగ మును అంటియున్న చక్రకూటమండలములో నుండియు, పోవలసివచ్చెను. దీనివలన విజయాదిత్యునకు, కళింగ రాజయిన భూ వేంద్రవర్మతోను, చక్రకూట మండల పరిపాలకుడైన బద్దెగ రాజుతోను పోరు సంభవించెను. కడకు భూపేంద్రవర్మను, బద్దెగరాజును ఓడించి విజయా దిత్యుడు దాహళమండలము ప్రవేశించి దాని రాజధాని అయిన కిరణపురమును ముట్టడించెను. అక్కడ జరిగిన యుద్ధములో ఓడిపోయి సంకిలుడు, కృష్ణునితో లోపలి భాగమునకు పారిపోయెను. కిరణపురమును దహించి విజయాదిత్యుడు శత్రువులను వెంబడించెను. దారిలో దాహళ, నిరూట, దలెనాడు మొదలయిన దుర్గములను స్వాధీనము చేసికొని శత్రువులిద్దరును తలదాచుకొన్న అచల పురమును ముట్టడించెను. ఇక్కడ జరిగిన యుద్ధములో కూడ కృష్ణరాజు ఓడిపోయి సంధికోరెను. రాష్ట్రకూట రాజ్యము యావత్తు వేంగీ చాళుక్యుల అధీనములోనికి వచ్చెను. కాని, విజయాదిత్యుడు కృష్ణ రాజును కనికరించి, అతని రాజ్యమును అతనికి ఇచ్చివేసి, రాష్ట్రకూట బిరుద ములను కొన్ని ధరించి, వారి రాజ్యచిహ్నములైన గంగా యమునలను, పాలి ధ్వజమును మాత్రము పరిగ్రహించి, తన రాజధానికి తిరిగి వచ్చెను.

ఈ రాష్ట్రకూట దండయాత్రానంతరము విజయా దిత్యుడు మూడు, నాలుగు సంవత్సరములు మాత్రమే రాజ్యము చేసెను. ఈ కాలమంతయు ప్రశాంతముగ నే గడచిపోయెను. ఈ విధముగా మొత్తము 43 సంవత్సర ముల కాలము రాజ్యముచేసి క్రీ.శ. 891 లో ఈ మహా రాజు దివంగతు డయ్యెను.

గుణగ విజయాదిత్యుడు పరరాజులతో అనేక యుద్ధ ములు జయప్రదముగా సాగించుటకును, 43 సంవత్సర ముల కాలము దేశములో ఏ విధమయిన ఆంతరంగిక కలహములు అలజడులు లేకుండ శాంతియుతముగా రాజ్య మేలుటకును ఇతని ఆశ్రితవర్గము ఒక ముఖ్య కారణము. వీరిలో పాండురంగ సేనాని, వినయడిశర్మ, రాజాదిత్యుడు అనువారు ముఖ్యముగా ప్రశంసాపాత్రులు. పాండురంగ నిని పండరంగడుగా కొన్ని శాసనములు వాక్రుచ్చు చున్నవి. పాండురంగ సేనాని తూర్పు చాళుక్యవంశ రాజుల ప్రాపకములో ఉండుచు, వారికి నమ్మినబంటుగా ప్రఖ్యాతి చెందిన బ్రాహ్మణ వంశ్యులలో నొకడు. ఇతని తండ్రి కటక రాజు ఎల్లప్పుడు విజయాదిత్య మహారాజును అంటి పెట్టుకొని ఉండి. అతడు నొలంబులతో చేసిన యుద్ధ