Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గర్భధారణము - ప్రసవసమస్యలు

సంగ్రహ ఆంధ్ర

అప్పుడు పరిస్థితిని గమనించవలెను. శిశువు తల సక్రమ రూపములో నుండినచో సహజమగు ప్రసవము జరుగ వచ్చును. పురోగమనము సంతృప్తికరముగా లేనిచో సిజేరియన్ సెక్షను ననుసరించుట అనివార్యమగును.

మావి (ప్లెజంటా ప్రీవియా) : మావి గర్భాశయము యొక్క అంతర్భాగమును అంటిఉండుటకు బదులుగా, క్రింది భాగమును అంటియుండి, పిండము బయటికివచ్చు ద్వారమును అడ్డగింపవచ్చును. మావి కొనయందున్న

చిత్రము - 96

పటము - 3

"ప్లెజంటా ప్రీవియా"

మావి గర్భాశయద్వారమును అడ్డుకొనియున్నది.

యెడల, సహజమగు ప్రసవము కలుగును. అది మధ్య భాగమునం దున్నయెడల, సహజముగా ప్రసవమునకు ముందే వేరుకాగలదు. అందువలన రక్తస్రావము, గర్భమునందలి పిండము చనిపోవుట సంభవింపగలదు. దానిని త్వరగా కనుగొని రక్తము ఎక్కించి, సిజేరియన్ శస్త్రచికిత్సచేయుటయే ఈ విషయమున అనుసరించవలసిన మార్గము.

ఫోర్ సెప్స్ : శిశువును మెల్లగా బయటికి లాగుటకు

చిత్రము - 97

పటము - 4

ఫోర్ సెప్స్

ఈ పరికరమును ఉపయోగింతురు. ఇది ఒకవిధమైన అనుబంధము. దీనిని ఉపయోగించుటకు వీలయిన పరిస్థితులు రెండు. (1) మార్గము పెద్దదియైయుండుట. (2) ముందుకు వచ్చు శిశువు యొక్క శరీరావయవములు క్రమమైన రీతిలో ఉండుట; నొప్పులు తక్కువగా నుండుట.

బహుళసంఖ్యలో జననములు : కవలలు జన్మించుట సాధారణవిషయమే. కాని ముగ్గురు, నలుగురు, అయిదు గురు శిశువులు జన్మించుటకూడ జరుగవచ్చును. అయిదుగురు జన్మించుట ఇప్పుడు ప్రసిద్ధ విషయము. వీరు బ్రతుకుట కూడ జరుగుచున్నది. వారు సమరూపులు కాని అసమరూపులు కాని కావచ్చును. ఒక్క మావి కాని రెండు మావులు కాని ఉండవచ్చును. సహజముగ ప్రతి శిశువు కొంత బరువును కోల్పోవును. కాబట్టి సమయము రాకముందే (అకాలమున) పుట్టిన శిశువుల విషయములో ఎక్కువ జాగ్ర త్త అవసరము. శిశువు యొక్క శరీరము నందలి ప్రతిభాగమును తాకిచూచి గాని, ఎక్స్ రేద్వారా గాని లోపములను కనుగొనవచ్చును. ఒకప్పుడు శిశువు గర్భములోనే మృతిచెంది ఎండిపోవచ్చును. అట్టి తీరున శిశు రూపమును "పేపి రేషియస్ పిండము" అందురు.

ఒక్కొక్కసారి “సయామీస్" కవలలోవలె రెండు పిండములు శరీరములందలి ఏదో ఒక భాగము నొద్ద - కటి ప్రదేశమువద్దనో, మొండెమువద్దనో - అతుకుకొనిపోయి యుండును. ఆ కవలలను వేరు చేయుటవలన వారు మరణించునట్టి అవకాశము ఎక్కువకలదు. ముందుగా సక్రమ రీతిని విచారణ జరిపియే అట్టి పనికి పూనుకొనవలెను.

ప్రసవానంతర "ప్యూర్ పీరియం" : గర్భాశయము ఆరు వారములలో సహజమగు పరిమాణమును పొందును. ప్రసవించిన స్త్రీకి 10 రోజులవరకు పూర్తి విశ్రాంతి కావలయును. రెండు మాసముల తర్వాత ఆమె తన గృహకృత్యములు నిర్వర్తించుకొనవచ్చును. ప్రసవానంతరము ఆమె పరీక్ష చేయించుకొనుట అవసరము. అందు వలన గర్భాశయము స్వస్థానమున లేకుండుట మొదలగు లోపములకు చికిత్స చేయించుకొనుటకు వీలుకలుగును.

ప్రసవసంబంధమైన క్రిమిజన్య విషదోషము ఈ క్రింది

318