కొల్లేరు సరస్సు సంగ్రహ ఆంధ్ర
కొల్లేరు సరస్సు :
I
ఈ సరస్సు కృష్ణా, పశ్చిమ గోదావరిజిల్లాల సరి
హద్దులో నున్నది. ఇది ఏలూరునకు ఆగ్నేయముగను,
కైకలూరునకు ఉత్తరముగను కలదు. ఈ సరస్సు ఈ
రెండు తాలూకాలకు చెందియున్నను అధికభాగము
ఏలూరు తాలూ కాయం విస్తరించియున్నది. ఇది యొక
చరిత్రాత్మకమైన సరస్సు. ఆంధ్రకోస్తాలో సహజసిద్ధ
మయిన పెద్ద మంచినీటి జలాశయము ఇది యొక్కటే.
స్థూలముగా అండాకారములో నుండి మెరకగానున్న ఈ
పెద్దసరస్సు మొదట బంగాళాఖాతములో ఒక భాగ మై
యుండెను. దీని కిరుప్రక్కలను మహానదులైన గోదావరీ,
కృష్ణలు సముద్రములోనికి చొచ్చుకొనిపోవునప్పుడు ఒక
దాని దక్షిణపుచివర మరొకదాని ఉత్తరపు కొనతో
కలియుచున్నది. ఆ విధముగా ఏర్పడిన భూభాగము
కొల్లేటిని సముద్రపునీటినుండి విడదీయుచున్నది.
ఈ మంచినీటి సరస్సు ప్రధానముగా తమ్మిలేరు, బుడ
మేరు అను పెద్దవాగులచే పోషింపబడుచున్నది. ఈ
రెండును తూర్పుకనుమలలో పుట్టుచున్నవి. వీటిలో
ప్రవ
మొదటిది చింతలపూడి, ఏలూరు తాలూకాలగుండ
హించుచు వచ్చి ఈ సరస్సులో చేరును. రెండవది
విజయవాడ, గన్నవరము, కైకలూరు తాలూకాల
గుండ వచ్చి దీనిలో చేరును. ఈ రెండు వాగులచే
నిది వర్షాకాలమందు ఒక మహాసముద్రమువలె కన్పట్టు
చుండును. పెక్కు భూములు వరదలపాలై పోవు
చుండును. ఈ వాగులనీరు ఈ సరస్సులో తేరుకొనును,
కాని అవి తీసికొనివచ్చెడి వండువలన ఇది త్వరితముగా
మెట్ట వేసిపోవుచున్నది. ఇట్లీ సరస్సు కొలది కాలములో
అదృశ్యము కాగలదేమో ! దీని వైశాల్యము ఎక్కువగా
మారుచుండును. వర్షాకాలములో దీనిపై శాల్యము 100చ.
మైళ్ళకు మించిపోవును. వర్షములు లేని కాలము లోనిది
బాగుగా తగ్గి ఒక్కొక్కప్పుడు ఎండిపోవుచుండును.
1900 వ సంవత్సరములో వర్షములు లేనప్పుడు ఇట్లే
జరిగినది. దీనిని బాగుచేసి గట్లు వేయుటచే సహజముగా
దీని పరిమాణము తగ్గుచున్నది. కృష్ణా, గోదావరి జిల్లా
లలోని మురుగునీరు చాల భాగము ఈ సరస్సులోనికి
చేరును. ఇందలి నీరు “పరెంటలు అవ" "జ్యూయర్ అవ" అను రెండు మార్గములద్వారమున బయటికిపోయి ఉప్పుటేరుతో కలసి సముద్రములో పడుచున్నది. లందు సుమారు 26 సారవంతములయి, కొల్లేరుమధ్య అనేక ములగు లంకలు కలవు. ఆ లంక గ్రామములు కలవు. అవి మిక్కిలి ఎక్కువ ఫలసాయము నిచ్చు చుండును. కాని బుడమేరు వరదలవల్ల తరచుగా అపార మగు నష్టములు కలుగుచుండును. అట్టి సమయములందు రాకపోకలు స్తంభించి రైతులు పెక్కు అగచాట్లకు లోనగుచుందురు. కొల్లేరులో చేపలు సమృద్ధిగా నుండును. అన్నిరకముల పక్షులు ఇచట నివసించుచుండును. ఒకప్పుడు ఇచటి నుండి పక్షులు, చర్మములు ఎగుమతిచేయబడు చుండెడి వట ! ప్రస్తుత మీ సరస్సునుండి పంపింగు విధానములో కొంత భూమికి నీరు అందించబడుచున్నది. ఆ నీటి కందుబాటులోనుండు తీరప్రాంతము లనేకములు మిగుల సారవంతములై అధిక ఫలసాయమును ఇచ్చుచున్నవి. కొల్లేరు సరోవరముండు ప్రదేశములో పూర్వము 12 ఆమడల వి స్తృతిగల ఒక మహానగరముండెడి దట! అందు యాగ కర్మనిష్ఠాగరిష్ఠులగు శ్రోత్రియు లనేకులు వసించు చుండిరట ! 'కొల్లు' అను గ్రామదేవత నారాధించుచు వారందరు మంత్రశాస్త్రపారగులై ఆ దేవతా ప్రీతికై వివిధ క్రియాకలాపముల నొనర్చుచుండిరి. అట్టి పట్టణమున ఒకానొక సమయమందు ఘటిల్లిన దీర్ఘకాలిక మయిన అనావృష్టి ఫలితముగా నిర్జల మేర్పడెను. బ్రాహ్మ ణుల యాగాది క్రియలవల్లగూడ నీరు లభించెడిది కాదట! ఒక బ్రాహ్మణగృహిణి జలాభావముచే కాలిమడితో అక్షతలను తడిపి హోమమున న కై భర్తకొసగెనట. వాటిని అగ్నియందు వ్రేల్చగ నే అవి బంగారు కణికలవలె రూపొం దె నట ! స్వర్ణలాభా వేడచే అందరును అట్లే చేయనారం భించిరట! ఇట్లు ఆ పురమంతయు, అనాచార కారణమున భ్రష్టమైపోయెను. ఒక బ్రాహ్మణ కుటుంబము మాత్రము ఇట్టి దురాచారమునకు పాల్పడక జలాభావమును అట్లే గ్రామము యొక్క శక్తి దేవత అగ్నిహోత్రములతో ఆ చోటును విడిచిపోవలె ననియు, పోవునపుడు మార్గమందు ఒక్కొక్క అగ్నికణ సహించుచుండెను. ఒకనాడా 92.