పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొలనుపాక సంగ్రహ ఆంధ్ర


మించుగా అప్రసిద్ధముగనే యుండెను. ఇది 14 సంవత్సర ములు స్వాతంత్ర్య సమరము సలిపి 1824 లో స్పెయిన్ ఆధిపత్యమునుండి విముక్తి నొందెను. 1881 లో వెనా మాతోకలిసి ఈ దేశము ప్రజాస్వామిక రాజ్య (Republic) మై వెలసెను. కాని 1906 లో పెనామా, కొలంబియా . నుండి విడిపోయెను. 1934-38 సంవత్సరములలో ఆల్ఫన్సోలో పెజ్ అను నాడు ఉదారవాదులకు (Liberals) అధ్యక్షుడుగా నుండెను. ఆ సమయమందు కొన్ని కార్మిక సంస్కరణ ములు ప్రవేశ పెట్టబడుటయేగాక రోమన్ కాథలిక్ మతమునకు ఇదివరలోగల ప్రత్యేకమగు ప్రభుత్వ రక్ష ణము తొలగింపబడెను. ఈతడే మరల రెండు తడవలు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడి 1945 వరకు అధికార మందుండెను. 1946 లో ప్రభుత్వము రూఢ మార్గవాదుల (conservatives) చేతులలోనికి వచ్చెను. కొలంబియారాజ్యాంగ చట్టము ననుసరించి ప్రతి నాలుగు సంవత్సరములకు ఒక 'అధ్యక్షుడు ఎన్ను కొనబడుచుండును. అతడే తన మంత్రివర్గము నేర్పాటు చేసికొనును. ఒ కేవ్యక్తి వరుసగా రెండు పర్యాయములు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడకూడదు. 63 మంది సభ్యులు గల సెనేటు అనబడు ఎగువసభ యొకటి నాలుగు సంవ త్సరముల కొకసారి జరుగు ఎన్నికల ఫలితముగా ఏర్పడు చుండును. ఇదికాక 123 మంది సభ్యులుగల ప్రతినిధులు సభయొకటి రెండు సంవత్సరముల కొకతూరి ఎన్నికల ద్వారమున ఏర్పాటు కావింపబడును. 21 సంవత్సర ములు దాటిన పురుషులందరు వోటింగు హక్కును కలిగి యుందురు. 21-30 సంవత్సరముల మధ్యనుండు పురుషు లెల్లరు సైనికవృత్తియం దుండవలెను. 1570 లో బోగోటాలో జాతీయ విద్యాలయమొకటి స్థాపింపబ డెను. అదికాక, మరికొన్ని స్థానిక విశ్వవిద్యాలయ ములు కూడ కలవు. ఆర్థికముగను, సాంఘికముగను శ్వేత జాతివారి ప్రాబల్యము నీగ్రోలమీదను, ఇండియనుల మీదును కాన నగును. దేశమందు స్పానిష్ భాషయే ప్రధానముగా మాట్లాడబడును. కె. వి. రె.

కొలనుపాక : ఒక నాడు దక్షిణాపథములో రాజకీయముగను, మత విషయకముగను గొప్ప కేంద్రస్థానములుగా నుండి స్వీయ పూర్వ ప్రాభవమును కోల్పోయిన పట్టణములలో ఈ కొలనుపాక అను గ్రామము ఒకటి. కొలనుపాక అను గ్రామము శాసనములయందు, కొలిపాక, కుల్పాక, కొట్టియపాక, కొళ్ళియపాక, కొట్టి పాక, కొల్లిహకే మొదలగు నామములతో నొప్పినది. ఇది స్థలపురాణాదులయందు బింబావతీపురి, వ్యాఖ్యనగ రము, సరోవర కుటీరము, సోమశేఖరపురము, కుదటి పురి, కుళుదపురము మొదలగు నామములతో వ్యవహ ఇది శైవమత కేంద్రస్థానముగా నుండి “దక్షిణకాశి" యను గౌరవనామము పొందియుం డెను. రింపబడినది. కొలనుపాక సిద్దిపేట రోడ్డుపై భువనగిరికి 20 మైళ్ళ దూరములో నున్నది. ఇది నల్లగొండ జిల్లాలో నున్నది. ఈ గ్రామమునందు దాదాపు 50 శాసనములు దొరకినవి. కల్యాణి రాజధానిగా పరిపాలించిన పశ్చిమచాళుక్య చక్రవర్తు ల పాలనములో ఈ కొలనుపాక నూరు సంవత్స రములు ఉండినట్లు శాసనములవలన తెలియుచున్నది. శ. 1042 నుండి 1143 వరకు పశ్చిమచాళుక్యుల ప్రతినిధుల పరిపాలనలో నున్నది. మొదటి జగదేకమల్లుడు క్రీ. శ. 1042 నాటి కే ఉండెను. క్రీ. శ. 1087 లో ఈ కొలనుపాక గ్రామము త్రైలోక్యమల్ల బిరుదముగల ప్రథమ సోమేశ్వర చక్ర వర్తి పాలనలో నుండినట్లు తెలుపు శాసనమొకటి కలదు. క్రీ. శ. 1078 నుండి 1126 వరకు ఆరవ విక్రమాదిత్యుడు పాలించిన కాలము. ఇతడు పరిపాలించు కాలములో కందూరు తాండయ్య, వ్యాళమహారాజు, బిత్తరపాలుడు, త్రిభువనమల్లుడు, అనంతపాలయ్య అను వారలు కొలను పాకలో రాజప్రతినిధులుగా వరలిరి. శ్రీమన్మహామండలేశ్వర శ్రీ సోమేశ్వర దేవభూతి కొలిపాకలో రాజ్యము చేయుచుండినట్లు క్రీ. శ. 1110, 1126 సం. ల నాటి శాసనములు తెలుపుచున్నవి. గురి జాల శాసనమును బట్టి క్రీ. శ. 1143 నాటికి కూడ కొలనుపాక పశ్చిమచాళుక్య చక్రవర్తుల పరిపాలనములో నున్నట్లు తెలియుచున్నది. 90