84
అనఁగా శాలివాహన వర్షములు 1342 లకు సరియైన క్రీ.శ. 1420 సంవత్సరమునఁ బడ్మపురాణము రచింపబడియె. కవి తనగ్రంథరచనాకాలము చెప్పకున్నను గందనమంత్రియు నతని కాశ్రయులగు ముప్పడియుఁ డెలుంగురాయఁడును బ్రభుత్వము చేసిన కాలములు సులభముగా లభించుచున్నందున మడికి సింగన కాలము దుస్సాధ్యము గానేరదు. సకలనీతిసమ్మతమునఁ బద్మపురాణమునుండి పద్యములు (204 మొ) గ్రహింపఁబడినందున ఇది 1430 క్రీ. శ. ప్రాంతముల రచింపఁబడియుండును. ఈకాలముననే శ్రీనాథుఁడును, నిశ్శంక కొమ్మనయు (శివలీలావిలాసకర్త), గౌరన, అనంతుఁడు. జక్కన, మల్లన మొదలగు కవులు తమతమకృతులచేఁ బ్రఖ్యాతివడయుచుండిరి. సకలనీతిసమ్మతము దేవాంకిత మైనను గందనామాత్యుని భ్రాతయగు కేసనమంత్రి సబహుమానముగా నిందుఁ బేర్కొనబడియె. కంచన బ్రాహ్మణుఁడు, కాశ్యపగోత్రజుఁడు. కందుకూరి వీరేశలింగం పంతులవారు కందనమంత్రి పూర్వజులలో నొక్కఁడగు గన్నమంత్రిని మార్కండేయపురాణకృతిపతియగు గన్నమంత్రిగా గ్రహించి ప్రమాదపరంపరతో భావనాసోపానములు గట్టెను. కందమంత్రిని,
| “ధరణీదేవకులాబ్ధిచంద్రవిలసద్దానాంబుధారార్ద్రవి | |
అని పద్మపురాణమున నష్టమాశ్వాసాంతమునఁ గవి సంబోధించెను. మారన మార్కండేయపురాణమున గన్నమంత్రి వంశావతారక్రమము వర్ణించుచు,
| “ఆచతుర్థకులసుధాంబుధి నుదయించె నమితకాంతిచంద్రుఁ డవనిభరణ | |
అని గన్నమంత్రిఁ జతుర్థవంశజునిగాఁ బేర్కొనియె. కావున నీరెండువంశములవారును భిన్ను లగుట నిశ్చయము. కందనమంత్రి తాతలు కాకతీయగణపతియొద్ద సామంతులై యుండి గణపేశ్వరాదిస్థలముల దేవాలయప్రతిష్ఠలు సేసి ప్రఖ్యాతి గాంచిరి. మడికి సింగన తిక్కనసోమయాజి కుమారుఁడగు కొమ్మనమంత్రికి దౌహిత్రుని కుమారుఁడు. ఆదౌహిత్రుఁడగు నయ్యలమంత్రియు