పుట:Sakalaneetisammatamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్పిన నలుగంగ మా ఱలిగి బీరముఁ బల్కినఁ జెప్ప నేర్చుఁ గా
కని మొగరించి మించి బఱియంబడు నయ్యడు గాఁగనేర్చు నే. 840

ఉ. కొందఱు మేలమాడుటలు కొందఱ వావులు దీర్చి పిల్చుటల్
కొందఱ ముద్దుసేయుటయు గొందఱ నెయ్యపుఁజూపు సూచుటల్
కొందఱ నాత్మభావమునఁ గొందఱ మన్నన భృత్యరాజి ని
ట్లందఱ నన్ని భంగుల నృపాగ్రణి వశ్యులఁ జేయఁగాదగున్. 841

చ. మొఱపునఁ బోవుగాక మొగమోటమి నిల్చునె రాజుమోము ము
న్నెఱుఁగనిబంట్లువారఁబలె యే మని భృత్యుల నూఱడించుఁ బే
రెఱుఁగని రాజు తాన భటులెల్లను దన్ను నెఱుంగనివారిఁ దా
నెఱుఁగుచుఁ బ్రీతితోడ నిలువందగు రాజనువాని కెప్పుడున్. 842

నీతిసారము



సీ. వానయు సీతును వర్జించి మండువేసవి గాకమున్న సస్యములపంట
లొదవెడితఱి నెత్తనది శత్రుపైఁ బూరిగడ్డియు నీళ్ళులు గలుగుతెరువు
గాఁ జూచి నడచుట కర్జంబు సిడములు గంకటములు బడిగలును విండ్లు
మొదలగు నాయుధములు రథగజహయంబులు సవరణలు నపూర్వభంగి
గీ. నొప్పి యతిభీకరంబులై యుండవలయు
శంఖకాహళపటహవిస్సాణముఖము
లైనతూర్యముల్ మంచివి యగుట లెస్స
యధిప విడిదల సమతల మగుట మేలు. 843

శాంతిపర్వము



సీ. ఎందాఁక ధాన్యంబు లెందాఁక నిజమిత్రు
లెందాఁక నుదకంబు లెసఁగియుండు
నెందాఁక విశ్వాసు లేఁగి యచ్చటివారి
నాప్తుల గావింతు రంతదాఁక
నెందాఁక నీరీతి నితరునిదేశంబు
శుద్ధమార్గం బయి సొంపు మిగులు
నందాఁక విజిగీషుఁ డార్తి జనంబులు
సొంపకుండఁగ నేఁగవలయు నిట్లు
ఆ. గాక ధాన్యమిత్రఘనతోయవిధ్వస్త
జనవిహీనమయ్యుఁ జనియెనేని
అనుగలంబు నొందియరులచేఁ గీడ్పడి
మరలి వచ్చుటెట్లు మనుజవిభుఁడు. 844

క. తనబలముల కనురాగము
జనియింపఁగ ననుదినంబు సత్కారములన్
దనుపుచు గురుయుద్ధంబుల
జనులెల్లను మిగుల డస్సి చనకునికి తగున్. 845

అజ్ఞాతము