పుట:SaakshiPartIII.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

7. ఉన్మత్తుని యుపన్యాసము

జంఘాలశాస్త్రి విశాఖపట్నం వెళ్లి పిచ్చి ఆసుపత్రికి వెళ్లాడు. పిచ్చివాళ్ల మాటల ధోరణి వినడం అతనికి ఇష్టం. పూర్వం స్త్రీపురుష సౌందర్యం గురించి, పరిణామక్రమం గురించీ తనతో మాట్లాడిన పిచ్చిమనిషి వుంటాడేమోనని అతనుంచిన కొట్టు దగ్గరకు వెళ్లాడు. అతను లేడుగాని మరొకాయన వున్నాడు. ఆయన తను కూర్చుండే తాటాకు చాపలో ఆకుల్ని చీలుస్తున్నాడు. జంఘాలశాస్త్రి ఎందుకలా చేస్తున్నారని ప్రశ్నించాడు.

‘సృష్టిలో ఉన్న ఒక్కొక్కడి ఆకు ఇలా చింపుతున్నానని-ఉపన్యాసం ప్రారంభించాడు. సృష్టి పనికిమాలినదనీ, అర్థంలేనిదనీ, నశించడమే మంచి దనీ ప్రకటంచాడు. సృష్టికర్తను గురించి తెలియకపోవడమే జ్ఞానమని నిర్వచిం చాడు. ఇక్కడ పాతవిభేదాల స్థానంలో కొత్తతరహా మానవ విభేదాలు తలెత్తడం ఒక్కటే విశేషమన్నాడు. మనుషుల రెండు నాల్కల ధోరణిని విమర్శించాడు. ప్రతివారూ ప్రేమతత్త్వాన్ని, సామరస్యాన్నీ వేదికలెక్కి ప్రబోధించేవారే -క్రియకు వచ్చేసరికి అంతాదోంగలే, దేశభక్తుల పేరిట చెలామణీ అయిపోతున్న వారి రంగుల్ని ఎండగట్టాడు. నిజమైన దేశభక్తి అంటే దేశీయ దేవతల్ని ఆరాధించడం, దేశీయ ఋషులు బోధించిన వేదాలననుసరించి కర్మ చేయడం దేశీయ జనాన్నేకాదు, సర్వభూతాలను తనతో సమానంగా చూసేవాడే దేశభక్తుడని నిర్వచించాడు. శాంతి, సహనం లేకుండా ఎవడికి వాడే నాయకుడనుకునే వాడే కద! అని ఈసడించాడు-

జంఘాలశాస్త్రి ఆయన మాటల తీరుచూసి ఆశ్చర్యపోయాడు. ఆయన, తనుపిచ్చివాణ్ణి కాదనీ, మేనబావను చూడ్డానికి ఇక్కడకువచ్చి -అతను తప్పించుకుపోగా, గత పద్దెనిమిది నెలలుగా ఇక్కడే వుంటున్నానని చెప్పాడు. వీలైతే ఈ 'చెర’ నుంచి విడిపించ మన్నాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

నాయనలారా! మొన్న విశాఖపట్టణమునకుఁ బోయి యచ్చటి పిచ్చి యాసుపత్రిలోని కేగితిని. నాకుఁ బిచ్చివారిమాటలను వినుట కెంతయో కుతూహలమగుటచే నచ్చటికిఁ