పుట:SaakshiPartIII.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

25. గానకళ

జంఘాలశాస్త్రి, ఏమీ తోచకుండా వుంటే, ఒకనాడు పిచ్చివాణ్ణి చూడబోయాడు. అలా తనకు అనిపించడం కూడా ఒక మానవ సహజగుణం అంటాడు. ప్రకృతిగతికి భిన్నమైనది మనల్ని ఆకర్షిస్తుందంటాడు.

ఈ పిచ్చివాణ్ణి రాజమండ్రిలో జంఘాలశాస్త్రీ కలుసు కున్నాడు. పేరు కొంపెల్ల రామభట్టుగారు. ఆయన్ని యోగి అని చెపుతారట జనం.

జంఘాలుడు ఆయనతో మాటలాడి, ఆయన వెర్రి ధోరణిని నెమ్మదిగా మరలించుకొని వచ్చి-ఉపన్యాస ధోరణిలో పెట్టాడు.

ఆ పిచ్చి మనిషి మాట్లాడడం సాగించాడు. మన సిద్ధాంత ప్రకారం ఉన్న దొక్కటేురసం. అది శృంగారం. అదే అవస్థా భేదం వల్ల కరుణగా, భక్తిగా మారింది. సృష్టిలో వేదాలతోపాటే కాదు, అంతకుముందే పుట్టిన కళ గానం. ఇదే లలితకళలన్నింటలో ఉత్తమం. మొదట రసం భక్తి. మొదటి కళ గానం. భక్తిపూర్ణమైన దేవతాగానంలో గానం. భక్తిపూర్ణమైన దేవతాగానంలో అక్షరాలక్కరలేదు. ఋక్కులకంటె, అక్షరాలేవీ లేని 'కూత’ ముందు పుట్టింది. కోయిలపాటలో, రాగాలాపనలో, అక్షరాలు లేవే! గానకళ అత్యంత స్వతంత్రకళ. మనవాళ్లు అక్షరాల సాయమిచ్చి సార్థకమూ, విశాలమూ చేశారు. తొలిసారస్వతమంతా గానమే. గానకళే ప్రథమ గణ్యం. దానికి రవ్వంత తోడుగా మాత్రమే కవిత్వం ఉండదగినది. ఒక్క గానానికే ప్రత్యేక ’కళాత్వం' గాని, కవిత్వానికి కాదు. చిత్రలేఖనం కృత్రిమం. గానకళ ప్రత్యేకంగా పరమాత్మతో సంబంధించిన కళ.

ఇలా మాట్లాడి మాట్లాడి పిచ్చివాడు హఠాత్తుగా పరవశంలోపడి నందకుమారా! నవనీతచోరా అంటూ, కృష్ణకీర్తనం చేసి పడిపోయాడు—అని జంఘాలశాస్తి ముగించాడు.

జంఘాలశాస్తి యిట్టు పలికెను:-

నాయనలారా! ఏమియుఁ, దోపక పోవుటచేత వినోదము కొఱకుఁ బిచ్చివానిఁ జూడ బోయితిని. చూచితిరా! మనుజప్రకృతి యెట్లున్నదో! స్వభావసిద్దముగ నున్నవానిని జూడ