పుట:SaakshiPartIII.djvu/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అశిథలపరిరంభవ్యాప్పతైకైకదోష్ణో
రవిదితగతయామా రాత్రి రేవ వ్యరంసీత్."

అన్న శ్లోకము మాత్రమే నిల్చి మిగిల్చిన యాతని శ్లోకములన్నియు నేమాయచేనైన శాశ్వతముగ నంతరించిపోవుట సిద్దించినను నీ కవిని శాశ్వతజీవునిఁ జేయుట కీశ్లోక మొక్కలకియే చాలును. కరుణ రసమందీతం డద్వితీయుడు. ఈతని భావనాశక్తి యసాధారణము.

మల్లెపువ్వు దూరి-మధుపంబుతోబాడి
గంధవాహుతోడ గలసి వీచి
యబ్దిలోన మునిఁగి యార్వవహ్నిని డాగి
నీటిబుగ్గయగుచు నింగి బ్రాంకి
తోఁక చుక్కతోడ ఢీకొని శ్రమజెంది
సాంధ్య రాగనదిని-స్నానమాడి
తనువునిండ నింద్ర-ధనుసురంగులు పూసి
కైరవాప్నసుధను-గైపుజెంది
గోఛగానరుతికి-మేళవింపుగ బాడి
పాడి యూడియూడి-పాడి సోలి
భావనామహత్వ-పటిమను బ్రహ్మమై
పోవుకవికి గోటిమైుక్కు లిడుదు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః