పుట:SaakshiPartIII.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. సాక్షి


1922లో సాక్షి సంఘము మూతపడిన తరువాత, - ఈసారి మళ్లీ తెరిచారు. జంఘాలశాస్త్రి ఈ విషయం ప్రకటిస్తూ, ఆంధ్రపత్రికలో ఇందుకు సంబంధించిన ప్రకటన శ్రోతలు చూసి వుండరనీ, మళ్లీ సర్వపురంలోనే, పోస్టాఫీసు ఎదుట ఇట్లే సాక్షి ఆఫీసనీ తెలిసి వుండదనీ అన్నాడు.

జంఘాలశాస్త్రి వీథి అరుగుమీద ఒంటరిగా కూర్చున్నాడు. ఇంతలో ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ఎదుట నిలబడ్డాడు. అతన్ని 'శనివారపు సంతకు వచ్చావా?" అని అడిగాడు. నిజానికి అతను ఉపన్యాసం వినడానికి వచ్చాడనే శాస్త్రి అనుకున్నా, బాగుండదని మాటమార్చి అడిగాడు. దాని మీదట తను అవలంబించిన 'దొంగ మాటల పద్దతి తనకే అసహ్యం వేసి - ఉపన్యాసం వినడానికి వచ్చావా! అని అడిగాడు. ఆ మనిషి తనకు సాక్షి సంఘమేమో, ఉపన్యాసమేమో ఏమీ తెలియదనీ, తమ కరణం గారికి మందు తప్పుగా ఇచ్చి చంపిన వైద్యుడవు కాదా? అని అడిగాడు. దానికి జంఘాలశాస్తి తను ఎందుకక్కడ కూర్చున్నదీ చెప్పాడు. “అవసరం నీది గనుక, ఇలా ఇక్కడ కూర్చోవడం ఏం బాగాలేదు. శనివారపు పశువుల సంతలోకి వెళ్లయినా ప్రసంగించు" - అని చెప్పి వెళ్లిపోయాడు.

జంఘాలశాస్త్రి ఈ ఉదంతం ఎందుకు చెప్పాడంటే, సాక్షి సంఘం మళ్లీ మొదలైంది శ్రోతల్లారా గమనించండి అని చెప్పడానికే —.


జంఘాలశాస్త్రి యిట్లు వ్రాసెను.

"సోదరులారా" యని సంబోధించి యుపన్యాన మిచ్చుటకు సభలో నేనుదక్క మఱి యెవ్వఁడును లేఁడే సాక్ష్యుపన్యాసములు తిరుగ నారంభ మగు నని యాంధ్రపత్రికారాజములోఁ బ్రకటించిన ప్రకటన నెవ్వరు చూచియుండలేదు కాఁబోలు! చూచి యుపేక్షించిరి కాఁబోలు! ఎటులైన నేమి? సభలో వినువాఁడు లేఁడు. సభలో నిది గొప్పలోపము కాదా?

గాయకుఁడగువాఁడు వినువారు లేకుండినను దనలోఁ దానుపాడుకొని యొకప్పుడు సంతోషింపవచ్చును. కవి యగువాఁ డొకపద్యమును వ్రాసి, దానిని భైరవితో నొకసారి చదివి,