పుట:Raajasthaana-Kathaavali.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చండుని కథ.


పదునాల్గవశతాబ్దము యొక్క యంతమునందు మీవారు దేశమునకు లఘుఁడను నతఁడు రాజయ్యెను. అతఁడు దనకుఁ బూర్వులైన హమీరు హమారునికుమారుఁడు నడచిన దారిని నడచి తొల్లి మీవారు రాజులు దుర్బలులైన కాలమున వారి వద్ద నుంచి ఢిల్లీ చక్రవర్తియుఁ దక్కిన రాజపుత్రులు నన్యాయముగఁ దీసికొనిన దేశములను మరల గ్రహించి దిట్టరి యయ్యెను. అంతియఁగాక యతఁడు పెద నూ రను పట్టణమును గట్టించెను. పూర్వు లెఱుఁగనితగరపు గనులకు వెండిగనులను గనుఁగొని త్రవ్వించెను.అతని కిద్దఱు కుమారులుండిరి.

అందు 'జ్యేష్ఠుఁడగు చండుఁడు శూరుఁడు, గౌరవనీయుఁడునై ప్రతిజ్ఞలు నిలుపుకోసుటలో నతినిష్ణురుఁడై విద్యావంతుఁడై బుద్ధిశాలియై యుండెను. కనిష్ఠుఁ డగు రఘుదేవుఁడు చక్కఁదనమునకు శాంతస్వభావమునకును 'బేరుపొంది ప్రజానురాగమును బడసి యుండెను. ఒకనాఁడు రాణాయగు లఘుమహారాజు కొలువై యుండగా నొక రాయబారి వచ్చి వానిపాదములపై నొక కొబ్బరి కాయను బడవైచెను. రాజస్థానమునందుఁ దమకూఁతు నెవనికైన వివాహార్ధ మయి యర్పింపఁ దలఁచిన వారు పెండ్లికొడుకు వారియొద్ద కొక టెంకాయనుబంపు టాకాలమునం దాచారము, మార్వారు దేశపురాజగు రణమల్లు తనకూఁతురగు హంసయను నామెను చండునకు వివాహము సేయదలంచినాఁ డని చెప్పవచ్చి యారాయబారి ముందుగ దేశాచారము నడవెను. కాయ తన కాళ్ళపైఁ బడ వేయుటచే నా రాజు తనకే కూఁతురు నీయఁ దలంచు కొన్నాఁ డనుకొని యారాణా పక్కున నవ్వి మీసము వడి వేయుచు రాయబారితో నిట్లనియె.

"ఆకాయ తీసికొని నాకుమారుఁ డగు చండున కిమ్ము తల