పుట:Prasarapramukulu022372mbp.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రసార ప్రముఖులు.

91

---లకు ఈ ప్రసారాలు ఉద్దేశించబడ్డాయి. సా. 5-45 నుండి అరగంటపాటు ఈ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అలానే శ్రీలంక నుండి సిలోన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ వానిజ్య ప్రసార విభాగం తెలుగు సినిమా పాటలతో చాలా పాపులర్ అయింది. శ్రోతలు కోరిన పాటలు, వారి పేర్లు ప్రసారం చేస్తూ ఎందరినో ఆకర్షిచింది. ప్రకటనలు బాగా లభించేవి. 'బినాకా, గీతామాలిక' వంటి ప్రముఖ కార్యక్రమాలు శ్రోతల్ని బాగా ఆకర్షించాయి. వాణిజ్య ప్రకటనలకు వ్యాపార వేత్తలు సిలోన్ రేడియోను ఆశ్రయించేవారు.

ఇటీవల వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రముఖమైన తర్వాత ఈ వాణిజ్య ప్రసార విభాగంవారు సిలోన్ నుండి ప్రసారాలు తగ్గించారు.

ఇటీవల విశ్వవాణి సువార్తవాణి పేర తెలుగులో క్రైస్తవ మత ప్రచార ప్రసారాలు జరుగుతున్నాయి. విశ్వవాణి మీడియంవేవ్‌పై చాలా శక్తివంతంగా --KHZ మీద ప్రసారాలు చేస్తూ అదే మీటర్లపై పనిచేసే కేంద్రాల కంటె శక్తివంతంగా ఉండేది. దాన్ని అదిగమించడానికి కడప, విశాఖపట్టణం, విజయవాడ కేంద్రాల ప్రసారశక్తిని 100 K W స్థాయికి పెంచాల్సి వచ్చింది.

వార్తా విభాగం

ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో ప్రాంతీయ వార్తా విభాగం ఎందరో ప్రసిద్ధుల్ని తయారుచేసింది. వార్తలు చదవడంలో తమదైన ప్రత్యేకతను చాటుతున్న వారెందరో వున్నారు.

శ్రీ తురగా కృష్ణమోహన్ : వీరు ప్రత్యేక బాణిలో వార్తలు చదివేవారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ప్రథమ ప్రయాణం కవర్ చేయడానికి డ్యూటీ మీద వెళ్ళారు. దురదృష్టవశాత్తు రైలు వెళ్ళిపోయింది. దాన్ని ఖాజీపేటలో అందుకొందామని పాత్రికేయ బృందం వాహనంలో వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. వీరి సతీమణి తురగా జానకీరాణి రచయిత్రి. వారు ఆకాశవాణిలో మహిళా కార్యక్రమాల ప్రొడ్యూసర్‌గా రెండు దశాబ్దాలు పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్‌గా రిటైరయ్యారు. పన్యాల రంగనాధరావు తమ