ప్రసార ప్రముఖులు.
35
ప్రసార రథం లాగుతున్న యువత
హైదరాబాదు కేంద్రంలో కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేస్తూ సాహిత్య సాంస్కృతిక రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు ఎందరో కీర్తి ప్రతిష్ఠలు గడించారు. ఆకాశవాణిలో పనిచేసే సదవకాశం వారి ప్రతిభను చాటుకొనేందుకు అవకాశాలు కల్పించింది.
పి. మధుసూదనరావు :
1950 డిసెంబర్ 10 న మధుసూదనరావు తెలంగాణాలోని వరంగల్ జిల్లాలో జన్మించారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం. ఏ. చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు రచనలపై పరిశోధన చేసి పి. హెచ్డి. పట్టా పొందారు. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా చేరి, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా హైదరాబాదు, మదరాసు కేంద్రాలలో పనిచేశారు. 1992లో వరంగల్ కేంద్రానికి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్గా వెళ్లారు. రాష్ట్రప్రభుత్వ నంది అవార్డుల కమిటీలో మదుసూదనరావు 94 సం.లో సభ్యులుగా వ్యవహరించారు.
P. S. గోపాలకృష్ణ :
పాతాళభేది గోపాలకృష్ణ 1949 జూలై 1న తిరుపతిలో జన్మించారు. M. A. పట్టభద్రులై మదరాసులో పత్రికలలో పనిచేసి ఆకాశవాణిలో 1977లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్గా మదరాసులో చేరారు. మదరాసు, హైదరాబాదు కేంద్రాలలో పని చేశారు. మైసూరు విశ్వవిద్యాలయం నుండి పి. హెచ్డి. పొందారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కార్యదర్శిగా మదరాసు, ఢిల్లీలలో 1983-85 మధ్య కాలంలో పనిచేశారు. A. S. D. గా విజయవాడ, మదరాసు, హైదరాబాదు కేంద్రాలలో 1992 నుండి అనుభవం గడించారు. గోపాలకృష్ణ మంచి విమర్శకుడు, రచయిత.
రమణ :
వెంకటరమణ గుంటూరుజిల్లా నరసారావుపేటలో 1941 జూన్ 27న జన్మించారు ఎం. ఏ. పట్టభద్రులై ఆకాశవాణిలో 1968 జూలైలో చేరారు. విజయవాడ కేద్రంలో పనిచేసి మదరాసు బదలీ అయ్యారు. 1977లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా యువవాణి కార్యక్రమాలను విజయవాడ కేంద్రంలో రసవత్తరంగా నిర్వహించారు. హైదరాబాద్ బదలీ అయి 1993లో అసిస్టెంట్ డైరక్టర్ అయ్యారు. 1995లో బెంగుళూరు దూరదర్శన్కు బదలీ అయ్యారు.