పుట:Prabandha-Ratnaavali.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56


ఈ రెండు పద్యములు అన్నయ సాముద్రికము లోనివి (చూడుడు. ముద్రిత ప్రతి వావిళ్ల 1951 )

ఈ అన్నయ సాముద్రికము నుండి శ్రీనాధుడు కాశీ ఖండమున పద్యము లను గ్రహించినాడు . ........ (428-89)

చూ. సాహితి - చొక్కనాథయ్య - (శివసుంద రేశ్వరరావు వ్యాసము • 1955)

కృష్ణరాయ యుగము

హరిభట్టు

ఈతని యుత్తర నారసింహ పురాణమునుండి యొక పద్యము (618} దాహరింపబడినది. ఈ కావ్యము నాంధ్ర సాహిత్య పరిషత్తువారు 1925లో ముద్రించిరి అందు పై పద్యము 1-22 7 లో నున్నది.

ఎడపాటి ఎఱ్ఱన

- కుమారనైషధము మల్హణ చరిత్ర - అను రెండు కృతు లీతనివిందుదా హృతములైనవి.

కుమారనైషధము అను కృతి ఎడపాటి ఎఱ్ఱన వ్రాసినట్లుగా నీ ప్రబంధ రత్నావళి నుండియే తొలుత లోకమునకు తెలిసినది ఇందుండి (72-89) 17 పద్యములు గలవు. శ్రీనాథుని నైషధచ్ఛాయ లింధుగలవు “నైషధమందలిదిగా నీ పద్యము నాం. సొ. గ్రంథసంధాత యుదాహ రించినాడు నైషధమున గానరాదు

సీ. మించికన్నులఁ గోరగించు రాజాన్నఁబు లొలుపయించుక లేని యొలుపుబప్పు
నభినవసంత ప్త హై యంగలీ నంబుఁ బరువంపు రుచినొప్పు పాయసములు
నేతను మిరియాల నెనసిన కూరలు ఇండశర్కరతోడ పిండివంట
గొర్రుగా గాచిన గోక్షీరపూరంబు పనస రంభాచూతఫలచయంబు

గీ. ద్రాక్షపండులు ఖర్జూర మాక్షికములు
బహు సుగంధిరసావళుల్ పానకములు
పెక్కువిధముల పచ్చళ్లు పెరుగు మజ్జి
గలును వడ్డించి రెంతయుఁ గ్రమముతోడ. ........(పుట 182-88)