పుట:Prabandha-Ratnaavali.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ. జెరివి తాల్చి యెత్తి చీరి బంధించి ని
ర్జించి యేసి యేర్చి చెఱిచి మట్టఁ
గడఁగచున్న శౌరి కరుణావిధేయుఁడై
మనలఁ గోర్కులిచ్చి మనుచుఁగాత.[1] (జ) 486



సూరయ్య, నూతనకవి [ధనాభిరామము] (జ)
చ. ఇరువదియాఱు వీక్షణములెన్నఁగ నాలుగు వక్రచేష్ట లిం
పరుదుగ నేడు భ్రూనటన లర్వదినాలుగు దోర్విలాసముల్
సరసతఁ జూపి హంస వృష సామజ వాయస శుద్ధ సంగతుల్
పరువడి ముట్ట నిల్పె సితపంకజలోచన పాడుచుండఁగన్. (జ) 487

సోమయ్య, దామరాజు [భరతము] (జ)
ఉ. అంబరసీమఁ దారలు జటాటవి మల్లెవిరుల్ భుజాంతరా
ళంబున హారసంతతు లిలాస్థలిఁ బూవులవర్షముల్ ప్రసూ
నంబులు సత్కృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళి గం
గాంబుకణంబు లుట్టిపడ నాడెడుశంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్. (జ) 488

మ. అడుగుల్ ముప్పదియాఱిటన్ వెడలు పై హస్తత్రిషట్కంబుచే
నిడుపై యున్నతమై సమస్థలమునై నిర్మోకహస్తాంకమై
మృడ మిత్ర [?] పులందు వాకిలొకటై మించం గవాక్షంబు లిం
పడరన్ శాలను రాజు షడ్విధము నాట్యంబిట్టు సేయించుటన్. (జ) 489

ఉ. నంది మృదంగరావము ఘనస్తనితంబని మ్రోల నున్న యా
స్కందుని వాహనంబగు శిఖండి యఖండితనృత్యమాడ భీ
తిం దన హస్తరంధ్రముగతిం జొరునాభరణాహిరాజి వో
వం దలయూచువిఘ్నపతి భాసురపూత్కృతి మమ్ముఁ బ్రోవుతన్. (జ) 490

సీ. ప్రాకారములయందుఁ బటుగోపురంబుల దామరమ్యద్వారసీమలందు
విపణిగృహంబుల వెలయునాయుధహస్తభటులను హి[తము]గాఁ బ్రౌఢి నిల్పి
రక్షితంబొనరించి రాజబింబ ద్యుతుల్ మించికాయుచు నున్న మంచివేళ
మహిమ నాప్తసుబంధుమధ్యస్థలమునందుఁ జెలఁగి రత్నాసనాసీనుఁడగుచు

  1. ఆంధ్రసాహిత్యపరిషత్తు గ్రంథసంధాత ఈపద్యమును భీమకవి దశావతారపద్య మని పేర్కొనెను.