పుట:Prabandha-Ratnaavali.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 ప్రబంధరత్నావళి

ర్మదగాత్రంబు కరంబులం దునుమ ధారాళాస్రపూరంబు కా
వి దివిం బర్వినకైవడిన్ గలయఁబర్వెన్ సాంధ్యరాగచ్ఛవుల్. (జ) 308

ఉ. బీద శచీవిభుండు దితిబిడ్డ లవార్యులు వారు పల్మఱున్
బాధలఁ బెట్టఁగాఁ జెఱలు పట్టఁగ నుండుట భారమంచు రం
భాది మరున్నివాస లసదప్సరల్ చనుదెంచి వచ్చిరో
నా దరఫుల్లపద్మవదనల్ విహరించుదు రప్పురంబునన్. (జ) 309

సీ. లాజవిమోక్షవేళాసముద్గతహోమ ధూమవాసన మేనఁ దొంగలింప,
మృగనాభిమకరికారేఖలై మృదుగండమండలి హోమధూమములు నిలువ,
హోమధూమశిఖాముఖోష్ణంబు సోఁకి పూర్ణేందుబింబాననం బెఱ్ఱవార,
మాటికి హోమధూమంబుచే వెడలెడు కన్నీటఁ గాటుక కరఁగి పాఱ,
గీ. గురుజనోక్తవిధానానుకూల చాల[?]
నిజవివాహవిలాసంబు నిర్వహించి
భోజుఁ డప్పుడు వేడుక బుధకవి వి[?]
తానములతోడ నార్ద్రాక్షతములు చల్లె. (జ) 310

సీ. శశిమండలముమీఁద సాంద్రచంద్రికవోలె నునుమొగంబునఁ దెల్లఁదనము నిల్చె
బసిఁడికుండలమీఁద బలభిన్మణులువోలె వలిచన్నుముక్కుల నలుపు లొదవె
నిఱుపేదమీఁది నిర్ణిద్రసంపదవోలె మధ్యభాగంబున మహిమఁ దాల్చెఁ
గదలిన లతమీఁది కమ్మపూవులువోలె నలవనిమేన సొమ్ములు దొలంగెఁ
తే. దరుణిగమనంబు మిగుల మాంద్యము వహించె
వనజపత్రాక్షి కోర్కులు కొనలు సాఁగె
వనిత నేత్రాంతములు వసివాళ్ళు వాడె
రమణి తనువల్లి శయ్యల వ్రాలఁగడఁగె. (జ) 311

సీ. హేమసింహాసనం బెక్క నుద్యోగించు మణికల్పితాస్థానమంటపమున,
విసరించుకొనఁ జూచు వింజామరంబున వైరివీరవిలాసవతులచేత,
నాటింపఁ దలఁచు నానాద్వీపసంధుల గెలుపుఁగంబంబులు వలసినన్ని
దుష్టరాక్షసకోటిఁ దునుమ విచారించు మఘవన్ముఖాఖిలామరులు వొగడ
గీ. సంతసము జహ్ను కన్యాతటాంతరముల
నధ్వరంబులు గావింప నలవరించు
నెలఁత నిచ్చలు నిజగర్భనివసదర్భ
కప్రభావపరిప్రాప్తి గౌరవమున. (జ) 312