పుట:Parama yaugi vilaasamu (1928).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.


శ్రీ పిఠాపురసంస్థానాధీశులగు శ్రీ శ్రీ శ్రీ మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావుబహద్దరువారు ప్రాచీనాంధ్రగ్రంథ సంపాదనమునకై నన్ను నియమించిన కాలమున (1917 సం॥ర॥ ) మైసూరులోని మహారాజకళాశాలాంధ్రోపాధ్యాయులగు బ్ర శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు నాకిచ్చిన గ్రంథములలో "పరమయోగివిలాసము" కూడఁ జేరియుండెను. ఆప్రతి కొంతశిథిలమైయుండెను. మద్రాసులోని గవర్నమెంటు ఓరియంటల్ లైబ్రరీలోఁ గూడ మఱియొకప్రతి యుండఁగా రెండింటికి శ్రీమహారాజావారు ప్రతులను వ్రాయించి బ్ర॥ శ్రీ శతావధాని ఓలేటి వేంకటరామశాస్త్రిగారిచేఁ బాఠమును సరిచేయించి ముద్రింపించి జీర్ణోద్ధరణము గావించి యాంధ్రలోకమునకు మహోపకృతిం గావించిరి. ఈగ్రంథము ముద్రితమైన పిమ్మట "రెడ్డిరాణిపత్రిక" యొక్క సంపుటము 5 సంచిక 6 లో శ్రీ శేషాద్రిరమణకవులు హైదరాబాదులోని "రెడ్డిబోర్డింగులోను, ఆంధ్రపరిశోధకశాఖలోను" రెండు తాళపత్రప్రతు లుండినటులు వ్రాసియున్నారు. కాని సమయముమించుటచే నాప్రతులతో నీగ్రంథమును సవరించుటకు వీలుకలుగ లేదు.

గ్రంథకర్త.

ఈ గ్రంథమును రచించినయాతఁడు "తాళ్ళపాక తిరువేంగళనాథుఁడు." "అష్టమహిషీకల్యాణము" అను మరియొ