ఈ పుట ఆమోదించబడ్డది
550
పరమయోగివిలాసము.
దొడరి యందులకు నాతోడ వాదింప
విడువుము బౌద్ధుల వెస నిందులోన
జాడతో నాగమసరణి వాదించి
యోడినవారల నొనరింపు మాజ్ఞ
యనిన భూవిభుఁడు పరాంతకు బౌద్ధ
జనులతో వాదింప సమకట్టుటయును
బరకాలుఁ డప్పు డాపరవాదిబలము
నురుతరానంతవేదోక్తఖడ్గముల
నలినలిఁ జేసి యెంతయు వీఁగఁదోలి
గెలిచిన నరుదంది క్షితినాథుఁ డప్పు
డరిదండధరునకు నవవతుం డగుచుఁ
బరమవస్తువుల సంభావించి యపుడు
హీనవాదులఁ జేసి యెదిరించి నట్టి
జైనుల దండించి జగములు వొగడ
మక్కువ బరకాలు మదదంతిరాజు
నెక్కించి పురమెల్ల నేగించి పొగడి
యిల పట్టభద్రున కెన్ని చిహ్నములు
గల వన్నిచిహ్నముల్ కడఁకమై నొసఁగి
యనిచినఁ బరకాలుఁ డారాజు వీడు
కొని రంగపురికి నేగుచునున్నతఱిని