ఈ పుట ఆమోదించబడ్డది
సప్తమాశ్వాసము.
549
బరిధాన మీ నొడంబడిన భూవిభుఁడు
కర ముగ్రమునఁ బరకాలు రావించి
యేమోయి పరకాల! యింతయధర్మ
మీమెయిం గావింప నిది నీకుఁ దగునె
యే నెంతచెప్పిన నిట్టి నీయోజ
మానకపోయితి మాటిమాటికిని
గుఱుతైన సౌగతగురుముఖ్యు నీతి
దొఱఁగి తెచ్చుట మహాద్రోహంబు గాదె
యన విని పరకాలుఁ డవనీశుతోడ
ననియె రాజని నిన్ను ననరాదుగాక
యాగమబాహ్యులరై యున్నయట్టి
సౌగతముఖుల నెక్కడఁ బొడఁగన్న
గతము సేయఁగఁ దగుఁ గాక భూపతికిఁ
బ్రతిఁ బెట్టి యవి తుదిం బాలింపఁ దగునె
మును త్రిపురాసురమోహార్థముగను
దనుజారి యట్టిమతంబుఁ గల్పించి
తుదిఁ దానె తన్మతస్థుల నెచ్చనీక
పదివేలవిధముల భంజింపవలయు
నని యానతిచ్చినాఁ డటుగాన బౌద్ధ
జనగురుహరణంబు సలిపితి నేను