ఈ పుట ఆమోదించబడ్డది
పంచమాశ్వాసము
405
సత్రంబు సలుప నచ్చటికి దేవతలు
ధాత్రిఁ గల్గినయట్టితపసులు సనఁగ
వారితోఁగూడ నిక్ష్వాకుండు నేగి
సారసాసనుమేటిజన్నంబుఁ జూచి
యతనియింటను విమానాంతరసీమఁ
బ్రతిలేని యారమాపతిని సేవించి
చలపట్టి యతనిఁ బ్రసన్నుఁ గావించి
యిలువేల్పుగాఁ గొల్తు నిలలోన ననుచుఁ
గనకగర్భునిచెంతఁ గ్రమ్మఱ నిలకు
ననిపించుకొని వచ్చి యతిఘోరతపము
నొనరించి యారమాయుతునిఁ బ్రత్యక్ష
మొనరించికొని యంత నుల్లసింపుచును
దనయేలు నాయయోధ్యాపురంబునకుఁ
గొనివచ్చి నిజభక్తిఁ గొలిచె నంతటను
గ్రమమున నలదశరధునిపర్యంత
మమితభక్తిని గొల్చి రతనివంశజులు
ఆవిష్ణునిజరూప మగు రామవిభుఁడు
రావణుఁ జంపి వారనివేడ్కతోడ
ధరణిజతో నయోధ్యకు నేగుదెంచి
సరసాత్ముఁడై విభీషణుని మన్నించి