పుట:Oka-Yogi-Atmakatha.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

269

అజాగ్రత్తగా ఉంచిన నీవాటిలో అతనికొకటి దక్కితే బాగుంటుందనుకున్నాను!”

వెంటనే నా గదికి ఉరికాను, కూరగాయల మీదే చూపు నిలిపిన ఆ దొంగ, గొంగడిమీద బట్టబయలుగా పడిఉన్న నా బంగారపు ఉంగరాల్ని, వాచీని, డబ్బును తాకనైనా తాకలేదని గమనించాను. దాని బదులు, అలవోకగా చూస్తే కంటబడకుండా ఉండేట్టు పూర్తిగా మరుగున ఉన్న గోబిపూల బుట్ట దగ్గరికి మంచం కిందినంచి పాకుతూ వెళ్ళాడు; మనసులో ఉన్న ఒకేఒక కోరికను దాంతో తీర్చుకున్నాడు.

ఆనాడు సాయంత్రం, ఈ సంఘటనను గురించి విప్పిచెప్పమని శ్రీయుక్తేశ్వర్‌గారిని అడిగాను (ఇందులో గాభరా పెట్టే సంగతులుకొన్ని ఉన్నాయని నాకు అనిపించింది).

మా గురుదేవులు మెల్లగా తల ఊపారు. ఎప్పుడో ఒకనాడు నువ్వు అర్థం చేసుకుంటావు. మరుగునపడిఉన్న ఈ నియమాల్ని కొన్నిటిని విజ్ఞానశాస్త్రం త్వరలోనే కనిపెడుతుంది.

కొన్నేళ్ళ తరవాత రేడియో వింతలు హఠాత్తుగా బయల్పడి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినప్పుడు, గురుదేవుల జోస్యం నా మనస్సులో మెదిలింది. దేశ కాలాల్ని గురించిన పాతకాలపు భావాలు తుడిచిపెట్టుకు పోయాయి. ఎవ్వరి ఇల్లూ కూడా, లండనో కలకత్తాయో ప్రవేశించలేనంత ఇరుకు ఏమీ కాదు! మానవుడి సర్వవ్యాపకత్వం తాలూకు ఒక అంశానికి నిర్వివాదమైన నిదర్శనం ముందు అత్యంత మందబుద్ధి కూడా వికాసం చెందింది.

గోబిపువ్వు ప్రహసనం “ఇతివృత్తాన్ని” రేడియో సామ్యంతో[1]

  1. 1939 లో రూపొందించిన రేడియో సూక్ష్మదర్శిని, అప్పటివరకు అజ్ఞాతంగా ఉన్న కిరణాల కొత్తలోకాన్ని ఆవిష్కరించింది. “స్వతహాగా మానవుడూ, జడపదార్థమని చెప్పే రకరకాల ద్రవ్యాలూ కూడా ఎడతెరపిలేకుండా కిరణాల్ని ప్రసారం చెయ్యడం జరుగుతుంది; వాటిని ఈ పరికరం “చూస్తుంది” అని రాసింది ‘అసోసియేటెడ్ ప్రెస్’ పత్రిక . “మానసిక ప్రసారాన్నీ (టెలిపతీ), రెండో చూపునూ, యోగదృష్టినీ నమ్మేవాళ్ళకు, ఒక వ్యక్తినుంచి మరో వ్యక్తికి నిజంగా ప్రసరించే అదృశ్యకిరణాల ఉనికికి మొట్టమొదటి శాస్త్రీయ నిదర్శనం ఈ ప్రకటనలో కనిపిస్తుంది. ఈ రేడియో పరికరం వాస్తవానికి, రేడియో స్పందన వర్ణపటదర్శిని. మామూలు వర్ణపటదర్శిని (స్పెక్ట్రోస్కోప్) నక్షత్రాలు ఏర్పడ్డానికి కారణభూతమైన రకరకాల అణువుల్ని కళ్ళకి కట్టించినట్టుగానే ఈ పరికరం, చల్లని నిస్తేజ పదార్థాన్ని కళ్ళకి కట్టిస్తుంది. ........మనిషి దగ్గర నుంచీ జీవపదార్థాలన్నిటినుంచీ వచ్చే అటువంటి కిరణాల ఉనికిని శాస్త్రజ్ఞులు చాలా ఏళ్ళుగా అనుమానిస్తూనే వచ్చారు. వాటి ఉనికికి ఈనాడు మొట్టమొదటి ప్రయోగాత్మక నిదర్శనం కనిపించింది. ప్రకృతిలో ప్రతి అణువూ ప్రతి పరమాణువూ ఎడతెరపిలేని ఒక రేడియో ప్రసారకేంద్రం అని ఈ ఆవిష్కరణవల్ల తెలుస్తోంది. ఆ ప్రకారంగా, ఒకప్పుడు మనిషిగా ఉన్న పదార్థం, చచ్చిపోయిన తరవాత కూడా తన సూక్ష్మకిరణాల్ని విడుదలచెయ్యడం కొనసాగిస్తూనే ఉంటుంది. ఆ కిరణాల అలపొడవులు, ఇప్పుడు ప్రసారంలో ఉపయోగించే చిన్న రేడియో తరంగాలకున్న చిన్న వాటి మొదలుకొని పెద్దతరంగాలకన్న పెద్దవాటి వరకు ఉంటూంటాయి. ఈ తరంగాల కలగలుపు దాదాపు ఊహించలేనిది. ఇలాటివి లక్షోపలక్షలు ఉన్నాయి. చాలా పెద్ద పరమాణువు ఒక్కటి, ఒకే సమయంలో 10,00,000 వేరువేరు అలపొడవుల్ని విడుదల చెయ్యవచ్చు. ఈ రకమైన నిడువైన అలపొడవులు, రేడియో తరంగాలంత సులువుగానూ వడిగానూ ప్రయాణం చేస్తాయి. ......మనకి పరిచయమైన వెలుతురులాంటి కిరణాలకి ఈ కొత్త రేడియో కిరణాలకీ, ఆశ్చర్యం కలిగించే భేదం ఒకటుంది. అదేమిటంటే, నిశ్చలమైన పదార్థంనుంచి వెలువడుతుండే ఈ రేడియో తరంగాలు వేలాది సంవత్సరాల పాటు అలా వెలువడుతూనే ఉంటాయి.”