పుట:Neti-Kalapu-Kavitvam.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

వాఙ్మయ పరిశిష్టభాష్యం - నేటికాలపుకవిత్వం


 గోవింద యని నీవు గోదావరిలోబడి
 దేవతల్లో గలిసి నావా చంద్రమ్మ
 నే నింక బతికెవున్నానా చంద్రమ్మ
                                 (యెంకయ్య చంద్రమ్మపాట)

అనేమాటలు జాలిపుట్టిస్తున్నవి

"గోవుమా లచ్చిమికి కోటిదంణాలు
 మనిసికైనాలేని మంచిపోకిళ్లూ
 యెంకితోకూకుండి యింతసెపుతుంటే
 తనతోటి మనిసల్లె తలతిప్పుతాది
 గోవుమాలచ్చిమికి కోటిదణ్నాలు

అనేమాటలు అమాయిక తిర్యక్ప్రకృతిని గురించినవి బావావున్నవి. ఈకరుణాదులకుగూడా కొంతవరకైనా పరిణతిగల నాయకులున్నప్పుడు పరిణతభావోన్మీలనానికి కవికి అవకాశం యేర్పడుతుంది లేదా యెంకి పాటల్లోవలె యెంకయ్య చంద్రమ్మపాటలోవలె మామూలు యేడ్పే మామూలు తలపులే వ్యక్తమవుతవి. కరుణాదులకు ఉత్తమనాయకుల ఆవశ్యకతలేదు గనకనే లొకోత్తరగుణోత్తరనాయకులు లేకున్నా పాశ్చాత్యుల ట్రేజడీలనే కరుణభయానక భీభత్స విశిష్టమైన రూపకాలు శ్రోతవ్యంగా ద్రష్టవ్యంగా వుంటున్నవి. ఈచర్చ యింత కెక్కువ అప్రస్తుతం గనుక చాలిస్తున్నాను. ఉత్తమశృంగారానికి ఉత్తమనాయకులు ఆవశ్యకమని నిరూపించాను.

అని శ్రీ ఉమాకాన్తవిద్యా శేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో శృంగారాధికరణం సమాప్తం.