పుట:Naajeevitayatrat021599mbp.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోలీస్‌గార్డ్ ఉదంతం

నేను విదేశాలలో పర్యటిస్తూన్న ఆ 1929 ఉత్తరార్ధంలో కేంద్ర శాసన సభలో బాంబులు విసరబడ్డాయి. అ కారణంగానూ, ఇతర కారణాలవల్లా, 1930 ఆరంభంలో అధ్యక్షుడు విఠల్‌భాయ్ పోలీసుగార్డ్ అసెంబ్లీలోపలికి రాకుండా తలుపులు మూయించాడు, ప్రభుత్వంవారు సభ్యుల రక్షణార్థం పోలీసుగార్డ్ లోపల ఉండితీరాలని పట్టుబట్టినా, విఠల్‌భాయ్ దానికి అభ్యంతరం చెప్పాడు.

ఈ పాయింటుమీద ప్రభుత్వంవారికీ, ప్రెసిడెంట్‌గారికీ మధ్య ఒక కలహం తలయెత్తింది. పోలీసు సహాయంతో తాను కార్యక్రమం నడిపించడ మన్నది తన ప్రతిష్ఠకు భంగకరం గనుక, ఎలాంటి పరిస్థితులలోనూ పోలీసుగార్డ్ లోపలికి రాకూడదన్నాడు. వారిని రానివ్వడమో, రానివ్వకపోవడమో అన్నది తన ఇష్టానిష్టాలతో కూడుకున్నదనీ, ఆ విషయం నిర్ధారణ చేయగల హక్కు తనకున్నదనీ ఆయన అన్నాడు.

పోలీసులు తన ఇష్టానికి వ్యతిరేకంగా లోపలికి రాకుండా ఉండడానికిగాను, అ శాసన సభా భవన ద్వారాలు బందు చేయించాడు. ప్రేక్షకులను రానీయడం విషయంలో కట్టుబాట్లు బిగించాడు. మూసిన తలుపుల వెనక కార్యక్రమాలన్నీ కొనసాగింప జేశాడు.

విఠల్‌భాయ్ పంపిన కబురు

కాంగ్రెసువారు సభనుంచి నిష్క్రమించడం విఠల్‌భాయ్‌కి కష్టంగానే ఉంది. నేను కాంగ్రెసు నుంచి వై దొలగడమూ, తిరిగీ నా సొంత టిక్కెట్టుమీద ఎన్నిక అవడమూ మొదలయిన కథంతా విని ఉండడాన్ని, ఆ సమావేశాల ఆఖరిరోజులలో, నన్ను ఢిల్లీవచ్చి ఆయనకు సహకారిగా ఉండమని ఆయన కోరాడు. నాకు టెలిగ్రాం ద్వారా కాంగ్రెసు నేషనలిస్ట్ పార్టీవారివద్ద నుంచి ఆహ్వానం వచ్చింది. నాకు పార్టీ నాయకత్వం ఇస్తామనీ, వెంటనే వచ్చి వారి పార్టీలో చేరమనీ ఆ ఆహ్వానం. ఇది నేను ఎన్నిక అయిన వెంటనే జరిగిన సంగతి.

అ ఆహ్వానానికి సమాధానమిస్తూ, నేను కాంగ్రెసువారి చిన్న చూపుకు సహించలేక రాజీనామా ఇచ్చి, మళ్ళీ నా సొంత టికెట్‌మీద, నా