పుట:Molla Ramayanam.djvu/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సన్నపుఁ గంఠ నాళముల సన్నలు సేసి సుఖించె నింపుగన్
దిన్నని చంద్రకాంతమణి తిన్నెలమీఁదం జకోరదంపతుల్..................... ||19||

ప్రభాత వర్ణణము

తే. పాకశాసని చేమంతి బంతి దివికి
నెగుర వేచిన కైవడి నేమి సెప్పఁ
బాండువర్ణంబుతోఁ బూర్వభాగ మందు
సొంపు మీఱంగ వేగురుఁజుక్క వొడిచె............................................... ||20||
వ. అట్టి సమయంబున.............................................................. ||21||
క. రవి యుదయించెను జనుఁడీ
దివియలు, నక్షత్ర సమితి, తిమిరము, శశియున్
బవ లేమిటి కనురీతిని
గువలయమున గూళ్ళుఁ గోళ్ళు గూయ మొదలిడెన్............................ ||22||
చ. వదలక పద్మరాగ మణి వట్రువ గ్రాలగఁ బట్టి నేర్పు పెం
పొదవఁగఁ దూర్పు కొండపయికొప్పుగఁ దెచ్చి జగద్గురుండు దాఁ
ద్రిదశవరేణ్యు కట్టెదురఁ దేఁకువ నిల్పినదర్పణంబు నా
నుదయము నొందె భానుఁడు సముజ్జ్వలకోకనద ప్రదీప్తులన్...................... ||23||
వ.ఆరాత్రి రాజశేఖరునిచిత్తంబు వచ్చునట్టుగా మెలంగి యా
తఁడు దన్ను మెచ్చు టెరింగి కైక యిట్లనియె.......................................... |24|
ఆ. వసుమతీశ ! నాకు వరమిచ్చి తప్పుట
తగవు గాదు మీకుఁ, దలఁపులోన
మఱచినా రదేమొ మన్నించి తొల్లింటి
యీవు లీయవలయు నీ క్షణంబ ........................................................||25||
క. జననాథ ! నా కుమారుని
వినుఁడీ పట్టంబు గట్టి వేవేగను, రా
మునిగా మునిఁగా ననుపుఁడు మఱి
వనమునఁ బదునాలు గేండ్లు వర్తింపంగన్................................................... ||26||