పుట:Molla Ramayanam.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క.కందర్పరూప. ఖండిత
కందర్పవిరోధిచాప ! కరుణాద్వీపా !
వందిత శుభనామా. ముని
సందోహస్తుత్యభూమ . జానకీరామా
వ.శ్రీ నారదమునీశ్వరుండు వాల్మికీముని కెఱింగించిన
తెఱంగు వినిపించెద నాకర్ణింపుము........................... |2|
సీ.తనసుమంత్రాది ప్రధానులతోఁ గూడి
సుఖగోష్టి నుండంగ సఖిలజనులఁ
జక్కఁగా రావించి సమ్మదంబున వంశ
గురువుతో దశరధధరణినాధుఁ
డనియె నీభూభార మంతయు నొక్కట
నేలితిఁ జాలదె యేక హేళి
నటుగాక పగతుర నవలీల గెల్చితి
నిల్పితి ధర్మమ్ము నిష్ఠతోడ
తే.నింత చాలదె యాశకు నెంత కెంత
రామచంద్రుని ధరణి రాజు గాఁగ
మీరు సూడంగఁ బట్టంబు భూరిమహిమఁ
గట్టవలయును మంచిలగ్నమునఁ జెలగి................... |3|
తే.అనుచు గురునకుఁ దెల్పి తా నతనిసమ్మ
తమున సౌభాగ్యమంగళద్రవ్యసమితిఁ
గూర్చుఁ డనుచు మంత్రులకును నెఱుంగఁ
జెప్పి శ్రంగార మీ పురిఁ జేయుఁ డనియ....................|4|