పుట:Mana-Jeevithalu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

గ్రహించాను. కాని సామూహిక కార్యాచరణకి అది పని చెయ్యదు."

ప్రణాళిక ప్రకారం చర్య తీసుకోవాలంటే దాన్ని నిత్యం మార్పు చేయటం అవసరమవుతుంది. ఒక స్థిర పథకం ప్రకారం చర్య తీసుకోవాలంటే అది తప్పకుండా భగ్నమవుతుంది - దానితో బాటు భౌతిక వాస్తవికతలనూ, మానసికమైన ఒత్తిడులనూ విచారించకుండా ఉంటే; మీరొక వంతెనను కట్టాలని పథకం వేసుకుంటే, దాని నమూనాని తయారు చేయటమే కాదు, ఉన్న మట్టినీ, భూభాగాన్నీ, కట్టవలసిన స్థలాన్నీ కూడా పరిశీలించాలి. లేకుంటే మీ పథకం సరిపోదు. భౌతిక వాస్తవికతలనూ, మానసికమైన ఒత్తిడులనూ, అన్నిటితో కూడిన మానవ ప్రక్రియని అర్థం చేసుకున్నడే పూర్తి చర్య సాధ్యమవుతుంది. ఈ అవగాహన ఏ నమూనాపైనా ఆధారపడి ఉండదు. దానికి కావలసినది సర్దుకు పోవలసిన లక్షణం. అదే వివేకం. వివేకం లేనప్పుడే మన నిశ్చితాభిప్రాయాలనీ, ఆదర్శాలనీ, లక్ష్యాలనీ పట్టుకుంటాం. ప్రభుత్వ వ్యవస్థ స్థిరమైనది కాదు. దాని నాయకులు అనుకుంటే అనుకోవచ్చు. ప్రభుత్వం కూడా వ్యక్తిలాగే సజీవమైనది. క్రియాశక్తి సంపన్నమైనది. క్రియాశక్తి సంపన్నమైన దానిని ఒక నమూనా అనే చట్రంలో బంధించలేము. మనం సాధారణంగా ప్రభుత్వం చుట్టూ గోడలు నిర్మిస్తాం - నిశ్చితాభిప్రాయాలూ, ఆదర్శాలు అనే గోడల మధ్య బంధించి ఉంచగలమని ఆశిస్తాం - కాని, ఒక సజీవమైన దాన్ని బంధించి ఉంచలేరు - దాన్ని చంపకుండా. అందుచేత ప్రభుత్వాన్ని నాశనం చెయ్యటానికి పూనుకుని ఒక పథకం తయారు చేస్తాం ఒక ఆదర్శం ప్రకారం. చచ్చిపోయిన దాన్ని మాత్రమే చట్రంలో బిగించగలరు. జీవితం నిత్యం చలనంలో ఉంటుంది కాబట్టి జీవితాన్ని ఒక నిశ్చితమైన విధానానికీ, ఒక నిశ్చితాభిప్రాయానికి కట్టి ఉంచిన క్షణంలో వైరుధ్యం బయలు దేరుతుంది. ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవటం వ్యక్తి వినాశమే. అందుచేత ప్రభుత్వ వినాశం కూడా. ఆదర్శం జీవితం కన్న ఉన్నతమైనది కాదు. మనం దాన్ని అలా చేసినప్పుడు గందరగోళం, వైరుధ్యం దుఃఖం తప్పవు.