పుట:Mahendrajalam.djvu/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాఢ నిద్ర కల్పించుట

ఇంతకు ముందు నిత్ర పుచ్చుట (సుఖ నిద్ర) గురించి చెప్పుకున్నాము. ఇది అమితమైన గాఢ నిద్రను కలిగించే ప్రక్రియ. ముందుగా గసగసాలను వేగీ వేగకుండా, కచ్చాపచ్చిగా వేయించిన తరువాత గుడ్డలో వేసి, మూటగట్టుకొని వుంచాలి. సమయానుకూలమైన మాటలు చెపుతూ ఆ మూటను నిద్ర కావలసిన వారికి - బాగా (5 - 6 సార్లు) వాసన చూపాలి. ఇలా వాసన చూసిన వారు 10 - 15 నిముషాల్లో బ్రహ్మాండమయిన గాఢ నిద్రను పొందుతారు.

నీళ్ళతో దీపాన్ని వెలిగించుట

ప్రదర్శకుడు తన పవిత్రమయిన మంత్ర శక్తితో నీళ్ళతో గూడా దీపాన్ని వెలిగిస్తానని చెప్పి, తన దగ్గర సిద్దంగా వున్న వత్తిని - నీళ్ళతో నింపిన ప్రమిదలో వేసి, వెలిగించగానే అద్భుతంగా ఆ దీపం వెలుగుతుంది. చూచు వారికి ఇది ఎంతో వింతగా వుంటుంది.

ముందుగా వజ్రదుగ్ధంతోనూ, నూనె తోనూ దూదిని బాగా తడిపి, వత్తులు చేసుకొని, ఆరబెట్టి, జాగ్రత్త చేసుకొని, ప్రదర్శన సమయంలో - వీటిని ఉపయోగించి దీపాన్ని వెలిగించాలి.

బూడిద వూస్తే సెంట్ గా మారుట

సభికులతో సందర్భానుసారంగా మాట్లాడుతూ - మీకు సెంటు వాసనతో కూడిన బూడిదను ఇస్తానని చెప్పి - వారినే